ETV Bharat / state

సీఆర్‌డీఏ కమిషనర్​తో అమరావతి ప్రాంత రైతుల భేటీ

author img

By

Published : Nov 26, 2019, 8:41 PM IST

రాజధాని అమరావతి ప్రాంత రైతులు సీఆర్​డీఏ కమిషనర్​ను కలిశారు. సీఎంతో జరిగిన సీఆర్‌డీఏ సమీక్ష సమావేశం అనంతరం... అపోహలు తొలగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామనే హామీతో సంతృప్తి చెందుతున్నామన్నారు.

amaravathi farmers meet CRDA commissioner
సీఆర్‌డీఏ కమిషనర్​తో అమరావతి ప్రాంత రైతులు భేటీ
సీఆర్‌డీఏ కమిషనర్​తో అమరావతి ప్రాంత రైతుల భేటీ

రాజధాని అమరావతి ప్రాంత రైతులు కొందరు విజయవాడలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ లక్ష్మీనరసింహంతో సమావేశమయ్యారు. సీఎంతో జరిగిన సీఆర్‌డీఏ సమీక్ష సమావేశం అనంతరం అపోహలు తొలగించారని కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్మాణాల సముదాయం, భవనాల నిర్మాణంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా... పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని కమిషనర్‌ వారికి తెలిపారు.

సీఆర్‌డీఏ పరిధిలోని రహదారులను ప్రాధాన్యక్రమంలో నిర్మిస్తామని... కృష్ణానది సమీపంలో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని... గత ప్రణాళికకు అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు వివరించినట్లు రైతులు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనలో అనవసర వ్యయం తగ్గించి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని రైతులు వివరించారు.

ఇదీ చదవండి

అధైర్యపడొద్దు... అండగా ఉంటాం: చంద్రబాబు

సీఆర్‌డీఏ కమిషనర్​తో అమరావతి ప్రాంత రైతుల భేటీ

రాజధాని అమరావతి ప్రాంత రైతులు కొందరు విజయవాడలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ లక్ష్మీనరసింహంతో సమావేశమయ్యారు. సీఎంతో జరిగిన సీఆర్‌డీఏ సమీక్ష సమావేశం అనంతరం అపోహలు తొలగించారని కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్మాణాల సముదాయం, భవనాల నిర్మాణంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా... పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని కమిషనర్‌ వారికి తెలిపారు.

సీఆర్‌డీఏ పరిధిలోని రహదారులను ప్రాధాన్యక్రమంలో నిర్మిస్తామని... కృష్ణానది సమీపంలో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని... గత ప్రణాళికకు అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు వివరించినట్లు రైతులు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనలో అనవసర వ్యయం తగ్గించి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని రైతులు వివరించారు.

ఇదీ చదవండి

అధైర్యపడొద్దు... అండగా ఉంటాం: చంద్రబాబు

Intro:Ap_Vsp_92_26_Buddist_On_Minister_Muttamsetti_Avb_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) తమ సాంప్రదాయాలను కించపరిచేలా బౌద్ధ క్షేత్రం పై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పూజలు చేయడం పట్ల బౌద్ధ సంఘాలు వ్యతిరేకించాయి.






Body:విశాఖలోని బౌద్ధారామం తొట్లకొండ పై ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఒక స్థూపం కూలిపోవడంతో తిరిగి దానిని పునర్నిర్మించేందుకు పర్యాటక శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.


Conclusion:అయితే 43 లక్షల రూపాయలతో బౌద్ధ క్షేత్ర అ మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టేందుకు మంత్రి మొత్తం శెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా శంకుస్థాపన పనులు చేపట్టారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పురోహితులతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడంతో బౌద్ధారామం పై పూజలు చేయడం నిషేధం అని బౌద్ధ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. చారిత్రాత్మకమైన బౌద్ధ క్షేత్రం లో బౌద్ధుల ఆచారాలు సంప్రదాయాలను మంట కలిపే విధంగా పూజలు నిర్వహించిన మంత్రి పై చర్యలు తీసుకోవాలని బుద్ధిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి.

బైట్: కొత్తపల్లి వెంకటరమణ, అధ్యక్షుడు బుద్ధిష్ట్ పరిరక్షణ కమిటీ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.