ETV Bharat / state

మహిళలకు అండగా ఘంటసాల స్వరపీఠం.. ఉచితంగా కుట్టులో శిక్షణ

author img

By

Published : Feb 18, 2023, 5:55 PM IST

Free Sewing Training in Eluru: స్వప్రయోజనం లేనిదే చిన్నమాట సాయం కూడా చేయని ఈ రోజుల్లో... 5 పదుల వయసులోనూ స్వలాభం లేకుండా సేవా భావంతో పనిచేస్తున్నారాయన. ఘంటసాల స్వరపీఠం అనే సంస్థను స్థాపించి.. పలువురికి సాయం చేస్తున్నారు. పని- పాట పేరుతో ఉచిత శిక్షణా కేంద్రం నిర్వహిస్తూ.. మహిళలకు స్వయం ఉపాధి కల్పించుకునేలా తోడ్పాటునందిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఎస్‌.ఎమ్‌. సుభాని...

TAILOR GIVING FREE TRAINING TO WOMEN
TAILOR GIVING FREE TRAINING TO WOMEN

Free Sewing Training in Eluru: ఈయన పేరు ఎస్ ఎమ్ సుభాని. కృష్ణాజిల్లాలో జన్మించిన ఈయన.. వృత్తి రీత్యా ఏలూరులో స్థిరపడ్డారు. దర్జీ కుటుంబం నుంచి వచ్చిన సుభాని.. తండ్రి నుంచి దర్జీ విద్య నేర్చుకున్నారు. ముందు నుంచీ సేవా భావం ఉన్న సుభాని.. తొలుత హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో ఓ సంస్థను స్థాపించి.. సుమారు వెయ్యి మంది మహిళలకు కుట్టులో శిక్షణ ఇచ్చారు. తర్వాతి కాలంలో ఏలూరులోని సత్రంపాడులో స్థిరపడిన ఆయన.. ఘంటసాల స్వరపీఠం పేరుతో మరో సంస్థను స్థాపించి కుట్టులో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. గృహిణులు, మహిళలు సరైన ఉపాధి లేక బాధపడకూడదనే ఉద్దేశంతో ఏళ్లుగా ఎంతో మందికి శిక్షణ ఇస్తూ వస్తున్నారు.

ఒక్కో బృందంలో 10 నుంచి 12 మంది మహిళలు ఉండేలా.. 100 రోజుల పాటు మహిళలకు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో వారికి కుట్టులో మెళకువలతో పాటు ఆసక్తి, మంచి గాత్రం ఉన్న వారిని ఎంపిక చేసి వారికి పాటలు పాడటంలోనూ తర్ఫీదునిస్తున్నారు. పనీ-పాట అనే పేరుకు తగ్గట్టే అటు ఉపాధి, ఇటు పాటలు పాడటంలో రెండిట్లోనూ మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఏలూరులో సంస్థ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ సుభాని వద్ద శిక్షణ పొంది తమ కాళ్లపై తాము నిలబడిన వారితో పాటు.. సొంతంగా షాపులు ఏర్పాటు చేసుకుని నడుపుతున్న వారి సంఖ్య దాదాపు రెండు వేలకు పైనే అంటే ఆశ్చర్యం కలగక మానదు. తమకు ప్రయోజనం ఉంటేనే కానీ.. ఎలాంటి సాయం చేసేందుకు ముందుకు రాని ఈ రోజుల్లో ఐదు పదుల వయసులోనూ తన వద్దకు ఎంత మంది వచ్చినా ఉచితంగా శిక్షణ ఇస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు సుభాని.

సుభాని వద్ద పని నేర్చుకుని కొంత మంది మళ్లీ ఇక్కడికే వచ్చి.. సాటి మహిళలకు కుట్టులో శిక్షణ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 100రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్నాక.. శిక్షణ కాలంలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి ఉచితంగా కుట్టు మిషను బహూకరించడం సుభానికి అలవాటు. మహిళలు ఉపాధి లేక ఆత్మన్యూనతా భావంతో ఉండకూడదు.. భర్త సంపాదించినా లేకున్నా.. ఇంటిని ఒంటి చేత్తో నెట్టుకురాగలిగేలా

స్వతహాగా పింగలి వెంకయ్యకు అభిమాని అయిన సుభాని.. ఆయనకు గుర్తింపు రావడంకోసం వినూత్నంగా కృషి చేస్తున్నారు. కుట్టు పనితో వచ్చిన దాన్లోనే కొంత భాగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూనే...మరోవైపు జాతీయ జెండాలను కుట్టి ఉచితంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తన ఊపిరి ఉన్నంత వరకూ మహిళలకు కుట్టులో ఉచితంగా శిక్షణ ఇస్తూనే ఉంటానంటున్న సుభాని ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.వారిని పనిమంతులను చేస్తున్నారు.

మహిళలకు అండగా ఘంటసాల స్వరపీఠం.. ఉచితంగా కుట్టులో శిక్షణ

ఇవీ చదవండి:

Free Sewing Training in Eluru: ఈయన పేరు ఎస్ ఎమ్ సుభాని. కృష్ణాజిల్లాలో జన్మించిన ఈయన.. వృత్తి రీత్యా ఏలూరులో స్థిరపడ్డారు. దర్జీ కుటుంబం నుంచి వచ్చిన సుభాని.. తండ్రి నుంచి దర్జీ విద్య నేర్చుకున్నారు. ముందు నుంచీ సేవా భావం ఉన్న సుభాని.. తొలుత హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో ఓ సంస్థను స్థాపించి.. సుమారు వెయ్యి మంది మహిళలకు కుట్టులో శిక్షణ ఇచ్చారు. తర్వాతి కాలంలో ఏలూరులోని సత్రంపాడులో స్థిరపడిన ఆయన.. ఘంటసాల స్వరపీఠం పేరుతో మరో సంస్థను స్థాపించి కుట్టులో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. గృహిణులు, మహిళలు సరైన ఉపాధి లేక బాధపడకూడదనే ఉద్దేశంతో ఏళ్లుగా ఎంతో మందికి శిక్షణ ఇస్తూ వస్తున్నారు.

ఒక్కో బృందంలో 10 నుంచి 12 మంది మహిళలు ఉండేలా.. 100 రోజుల పాటు మహిళలకు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో వారికి కుట్టులో మెళకువలతో పాటు ఆసక్తి, మంచి గాత్రం ఉన్న వారిని ఎంపిక చేసి వారికి పాటలు పాడటంలోనూ తర్ఫీదునిస్తున్నారు. పనీ-పాట అనే పేరుకు తగ్గట్టే అటు ఉపాధి, ఇటు పాటలు పాడటంలో రెండిట్లోనూ మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఏలూరులో సంస్థ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ సుభాని వద్ద శిక్షణ పొంది తమ కాళ్లపై తాము నిలబడిన వారితో పాటు.. సొంతంగా షాపులు ఏర్పాటు చేసుకుని నడుపుతున్న వారి సంఖ్య దాదాపు రెండు వేలకు పైనే అంటే ఆశ్చర్యం కలగక మానదు. తమకు ప్రయోజనం ఉంటేనే కానీ.. ఎలాంటి సాయం చేసేందుకు ముందుకు రాని ఈ రోజుల్లో ఐదు పదుల వయసులోనూ తన వద్దకు ఎంత మంది వచ్చినా ఉచితంగా శిక్షణ ఇస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు సుభాని.

సుభాని వద్ద పని నేర్చుకుని కొంత మంది మళ్లీ ఇక్కడికే వచ్చి.. సాటి మహిళలకు కుట్టులో శిక్షణ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 100రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్నాక.. శిక్షణ కాలంలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి ఉచితంగా కుట్టు మిషను బహూకరించడం సుభానికి అలవాటు. మహిళలు ఉపాధి లేక ఆత్మన్యూనతా భావంతో ఉండకూడదు.. భర్త సంపాదించినా లేకున్నా.. ఇంటిని ఒంటి చేత్తో నెట్టుకురాగలిగేలా

స్వతహాగా పింగలి వెంకయ్యకు అభిమాని అయిన సుభాని.. ఆయనకు గుర్తింపు రావడంకోసం వినూత్నంగా కృషి చేస్తున్నారు. కుట్టు పనితో వచ్చిన దాన్లోనే కొంత భాగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూనే...మరోవైపు జాతీయ జెండాలను కుట్టి ఉచితంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తన ఊపిరి ఉన్నంత వరకూ మహిళలకు కుట్టులో ఉచితంగా శిక్షణ ఇస్తూనే ఉంటానంటున్న సుభాని ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.వారిని పనిమంతులను చేస్తున్నారు.

మహిళలకు అండగా ఘంటసాల స్వరపీఠం.. ఉచితంగా కుట్టులో శిక్షణ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.