ETV Bharat / state

వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం: మల్లాడి కృష్ణారావు

author img

By

Published : Feb 16, 2021, 3:10 PM IST

యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుతోపాటు మరికొంత మంది కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేయటంతో...కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. మెజారిటీ కోల్పోయే పరిస్థితి నెలకొంది.

yanam mla malladi
మల్లాడి కృష్ణారావు

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. 30 మంది సభ్యులు ఉండగా 15 మంది కాంగ్రెస్.. ముగ్గురు డీఎంకే సభ్యులతో 2016 జూన్ 6న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. పార్టీలో సీనియర్ మంత్రులు, శాసనసభ్యులైన నలుగురు పార్టీకి, పదవులకు రాజీనామాలు చేయడంతో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయే పరిస్థితిలో ఉంది. అదే కోవలో తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న పుదుచ్చేరి యానాం శాసన సభ్యులు మల్లాడి కృష్ణారావు ఆరోగ్యశాఖ మంత్రి పదవికి... శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో యానాంలో భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది చర్చనీయాంశంగా మారింది.

యానాం ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తా..

''తన నియోజకవర్గంలో ప్రజల కష్టనష్టాలను పరిశీలిస్తూ వారికి తగిన సేవ చేస్తూ ఐదు సంవత్సరాల పాటు ప్రజలలో ఒకటిగా ఉండి ఆ తర్వాత శాసనసభ్యుడిగా పోటీకి సిద్ధమయ్యానని.. తన సేవలు గుర్తించి ఐదు పర్యాయాలుగా తనను ఎన్నుకుంటూ వచ్చారని మల్లాడి అన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తన కుమారుడు గాని, భార్య గాని ఏ రోజు ప్రజలకు సేవలు చేసిన పరిస్థితులు లేవని.. అలాంటప్పుడు వారిని తదుపరి నేతగా ప్రజలు ఏ రకంగా అంగీకరిస్తారు అని ప్రశ్నించారు. రాజకీయం అనేది వారసత్వం కారాదనే దానికే కట్టుబడి ఉంటానన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీలో గెలిచేందుకు కొంతమంది ధన బలంతో ముందుకు వస్తున్నారని... గత ఎన్నికల్లో ఏనాడు ఓటర్లు డబ్బుకు అమ్ముడు పోలేదని .. తాను పోటీలో లేకున్నా ఆ సంస్కృతిని యానాంలోకి ఎట్టి పరిస్థితిలోను రానీయనన్నారు. యానాం ప్రజల సంక్షేమం కొరకు.. పర్యాటక అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని... రానున్న 14 రోజుల్లో యానాం ప్రజలకు సంచలనాత్మకమైన విషయాలు చెబుతానని'' మల్లాడి అన్నారు.

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. 30 మంది సభ్యులు ఉండగా 15 మంది కాంగ్రెస్.. ముగ్గురు డీఎంకే సభ్యులతో 2016 జూన్ 6న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. పార్టీలో సీనియర్ మంత్రులు, శాసనసభ్యులైన నలుగురు పార్టీకి, పదవులకు రాజీనామాలు చేయడంతో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయే పరిస్థితిలో ఉంది. అదే కోవలో తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న పుదుచ్చేరి యానాం శాసన సభ్యులు మల్లాడి కృష్ణారావు ఆరోగ్యశాఖ మంత్రి పదవికి... శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో యానాంలో భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది చర్చనీయాంశంగా మారింది.

యానాం ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తా..

''తన నియోజకవర్గంలో ప్రజల కష్టనష్టాలను పరిశీలిస్తూ వారికి తగిన సేవ చేస్తూ ఐదు సంవత్సరాల పాటు ప్రజలలో ఒకటిగా ఉండి ఆ తర్వాత శాసనసభ్యుడిగా పోటీకి సిద్ధమయ్యానని.. తన సేవలు గుర్తించి ఐదు పర్యాయాలుగా తనను ఎన్నుకుంటూ వచ్చారని మల్లాడి అన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తన కుమారుడు గాని, భార్య గాని ఏ రోజు ప్రజలకు సేవలు చేసిన పరిస్థితులు లేవని.. అలాంటప్పుడు వారిని తదుపరి నేతగా ప్రజలు ఏ రకంగా అంగీకరిస్తారు అని ప్రశ్నించారు. రాజకీయం అనేది వారసత్వం కారాదనే దానికే కట్టుబడి ఉంటానన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీలో గెలిచేందుకు కొంతమంది ధన బలంతో ముందుకు వస్తున్నారని... గత ఎన్నికల్లో ఏనాడు ఓటర్లు డబ్బుకు అమ్ముడు పోలేదని .. తాను పోటీలో లేకున్నా ఆ సంస్కృతిని యానాంలోకి ఎట్టి పరిస్థితిలోను రానీయనన్నారు. యానాం ప్రజల సంక్షేమం కొరకు.. పర్యాటక అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని... రానున్న 14 రోజుల్లో యానాం ప్రజలకు సంచలనాత్మకమైన విషయాలు చెబుతానని'' మల్లాడి అన్నారు.

ఇదీ చదవండి:

135 రోజుల్లో 6వేల కిలోమీటర్లు.. దేశాన్ని చుట్టిరావడమే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.