ETV Bharat / state

అమలాపురంలో దారుణం... మహిళ దారుణ హత్య

author img

By

Published : May 14, 2021, 9:41 PM IST

కర్ఫ్యూను సైతం లెక్కచేయని దుండగులు... మినీ వ్యాన్ పై వెంబడించి ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆమె కుమారుడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కాటన్ రోడ్డులో జరిగింది.

woman-murder-in-amalapuram-east-godavari-district
అమలాపురంలో దారుణం... మహిళ దారుణ హత్య

అమలాపురంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. కాటన్ రోడ్డులో ఈ దుర్ఘటన జరిగింది. సమనస గ్రామానికి చెందిన కొండ్రు కోటేశ్వరరావు, మంగం చిరంజీవి కుటుంబాల మధ్య ఇంటి సరిహద్దు విషయంలో కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఇవాళ ఇరువురు గొడవపడ్డారు. కోటేశ్వరరావు అమలాపురంలో ఉన్న తన భార్య దుర్గను తీసుకురమ్మని కుమారుడు రమేశ్‌ను పంపాడు.

ఈ మాటలు విన్న చిరంజీవి కుమారులు విజయ్, నవీన్ వారికున్న మినీ వ్యాన్​లో అమలాపురం వచ్చి మోటార్ సైకిల్​పై వెళుతున్న తల్లి దుర్గ, కుమారుడు రమేష్​లపై మారణాయుధాలతో దాడి చేశారు. దుర్గను కిరాతకంగా హత్య చేశారు. ప్రత్యర్థుల దాడిలో కుమారుడు రమేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా ప్రదేశాన్ని అమలాపురం డీఎస్పీ వై.మాధవ రెడ్డి పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అమలాపురంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. కాటన్ రోడ్డులో ఈ దుర్ఘటన జరిగింది. సమనస గ్రామానికి చెందిన కొండ్రు కోటేశ్వరరావు, మంగం చిరంజీవి కుటుంబాల మధ్య ఇంటి సరిహద్దు విషయంలో కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఇవాళ ఇరువురు గొడవపడ్డారు. కోటేశ్వరరావు అమలాపురంలో ఉన్న తన భార్య దుర్గను తీసుకురమ్మని కుమారుడు రమేశ్‌ను పంపాడు.

ఈ మాటలు విన్న చిరంజీవి కుమారులు విజయ్, నవీన్ వారికున్న మినీ వ్యాన్​లో అమలాపురం వచ్చి మోటార్ సైకిల్​పై వెళుతున్న తల్లి దుర్గ, కుమారుడు రమేష్​లపై మారణాయుధాలతో దాడి చేశారు. దుర్గను కిరాతకంగా హత్య చేశారు. ప్రత్యర్థుల దాడిలో కుమారుడు రమేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా ప్రదేశాన్ని అమలాపురం డీఎస్పీ వై.మాధవ రెడ్డి పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి..

ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.