ETV Bharat / state

'ఏకాంతంగానే వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం'

author img

By

Published : Apr 18, 2021, 6:53 AM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఏకాంతంగానే జరగనుంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.

vadapalli venkateswara kalyana mahostavam
వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు భక్తులను అనుమతించడం లేదు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి 28 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్వామివారికి ఏకాంతంగానే కల్యాణ మహోత్సవాలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. భక్తులు గమనించాలని కోరారు.

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు భక్తులను అనుమతించడం లేదు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి 28 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్వామివారికి ఏకాంతంగానే కల్యాణ మహోత్సవాలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. భక్తులు గమనించాలని కోరారు.

ఇదీ చదవండి:

గొల్లమామిడాడలో ఏకాంతంగా శ్రీరామ నవమి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.