ETV Bharat / state

'అక్రమ కేసులు పెట్టిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలి' - ప్రత్తిపాడులో తెదేపా ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా.. ప్రత్తిపాడు మండలం చిన శంకర్ల పూడి గ్రామానికి చెందిన తెదేపా బీసీ నేత ఏపూరి శ్రీనివాస్​పై అక్రమ కేసు నమోదు చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్​ చేశారు. ఎస్సైపై అనుచిత వ్యాఖ్యల కేసులో శ్రీనివాస్​ 10 రోజుల క్రితం జైలుకు వెళ్లి బెయిల్​పై విడుదలయ్యారు.

tdp protest news
tdp protest news
author img

By

Published : Jun 19, 2020, 5:23 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చిన శంకర్లపూడి గ్రామానికి చెందిన తెదేపా బీసీ నాయకుడు ఏపూరి శ్రీనివాస్ బెయిల్ పై విడుదల అయ్యారు. ఎస్సైపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై 10 రోజుల క్రితం అరెస్టు అయిన శ్రీనివాస్.. బెయిల్​పై విడుదల అయ్యారు. శ్రీనివాస్​కు మద్దతుగా.. చిన్నశంకర్లపూడిలో గ్రామస్థులు, తెదేపా శ్రేణులు రోడ్ పై బైఠాయించారు. ఎస్సై రవికుమార్​పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. నియోజకవర్గ తెదేపా ఇన్​చార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో శ్రీనివాస్​కు సంఘీభావంగా తెదేపా శ్రేణులు ఆయన ఇంటికి చేరుకొన్నారు. ఎస్సై రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని తెదేపా శ్రేణులు డిమాండ్ చేశారు. బీసీలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని వరుపుల రాజా ఆరోపించారు.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చిన శంకర్లపూడి గ్రామానికి చెందిన తెదేపా బీసీ నాయకుడు ఏపూరి శ్రీనివాస్ బెయిల్ పై విడుదల అయ్యారు. ఎస్సైపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై 10 రోజుల క్రితం అరెస్టు అయిన శ్రీనివాస్.. బెయిల్​పై విడుదల అయ్యారు. శ్రీనివాస్​కు మద్దతుగా.. చిన్నశంకర్లపూడిలో గ్రామస్థులు, తెదేపా శ్రేణులు రోడ్ పై బైఠాయించారు. ఎస్సై రవికుమార్​పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. నియోజకవర్గ తెదేపా ఇన్​చార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో శ్రీనివాస్​కు సంఘీభావంగా తెదేపా శ్రేణులు ఆయన ఇంటికి చేరుకొన్నారు. ఎస్సై రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని తెదేపా శ్రేణులు డిమాండ్ చేశారు. బీసీలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని వరుపుల రాజా ఆరోపించారు.

ఇదీ చదవండి: దేశంలో 24 గంటల్లో 13,586 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.