ETV Bharat / state

ఇళ్ల పంపిణీలో జాప్యంపై తెదేపా నేతల ధర్నా

author img

By

Published : Nov 6, 2020, 4:34 PM IST

Updated : Nov 6, 2020, 5:13 PM IST

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా తెదేపా శ్రేణులు ధర్నా నిర్వహించారు. పూర్తయిన ఇళ్లను ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పెండింగ్​లో ఉన్న గృహ నిర్మాణ బిల్లులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ‘నా ఇల్లు - నా సొంతం’ పేరుతో ధర్నా నిర్వహించారు. 17 నెలల పాలనలో ఒక్క ఇల్లు కూడా ఎందుకు నిర్మించలేకపోయారని చినరాజప్ప ప్రశ్నించారు.

tdp-leaders-protest-for-distribution-of-houses
తెదేపా నేతల ధర్నాలు

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు. పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. అర్హత గల పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు వివిధ డిమాండ్​లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ మృత్యుంజయరావుకు అందజేశారు.

కొత్తపేట నియోజక వర్గంలో..

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్​లో ఉన్న గృహ నిర్మాణ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. పేదలకు ఉచితంగా రెండు సెంట్ల భూమి ఇవ్వాలని కోరుతూ మండల అధికారులకు వినతి పత్రాలను అందించారు.

పెద్దాపురం నియోజకవర్గంలో...

పెద్దాపురం నియోజకవర్గంలో లబ్ధిదారులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు తక్షణం పంపిణీ చేయాలని సామర్లకోట పట్టణం అమ్మణామ్మ గృహ సముదాయం వద్ద తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ‘నా ఇల్లు - నా సొంతం’ పేరుతో ధర్నా నిర్వహించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం తెదేపా ప్రభుత్వం ఇళ్లను నిర్మించిందని చినరాజప్ప తెలిపారు. వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేస్తే తెదేపాకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో వైకాపా ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు హాయంలో కట్టించారనే కారణంగానే పేదలకు ఇళ్లు అప్పగించకుండా సీఎం జగన్‌ వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏడాదికి 5 లక్షల ఇళ్లు ఏవి?

17 నెలల పాలనలో ఒక్క ఇల్లు కూడా ఎందుకు నిర్మించలేకపోయారని రాజప్ప ప్రశ్నించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని వైకాపా మేనిఫెస్టోలో చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. తెదేపా హాయాంలో రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలో ఇళ్లు మంజూరు చేశామన్నారు.

58 వేల ఎకరాల సంగతేంటి..?

ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి 60 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించిందని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. అందులో కోర్టులో కేసులున్నది రెండు వేల ఎకరాలపైనేనని వెల్లడించారు. మిగతా 58 వేల ఎకరాల్లో ఇళ్లపట్టాలు ఎందుకివ్వడం లేదని జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై ‘నా ఇల్లు-నా సొంతం, నా స్థలం-నాకివ్వాలి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

వాళ్ల ఇళ్లను వాళ్లే స్వాధీనం చేసుకుంటారు...

సెంటు పట్టా స్కీమ్‌లో 4 వేల కోట్ల అవినీతి జరిగిందని చినరాజప్ప ఆరోపించారు. ముడుపుల కోసం, వాటాల కోసమే పట్టాల పంపిణీలో వైకాపా నేతలు జాప్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. కలెక్షన్ల కోసమే పంపిణీని ఆపేశారని.. ఆ నెపాన్ని తెదేపాపై నెట్టాలనే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు స్పష్టం చేశారు. తమ కష్టార్జితాన్ని డిపాజిట్లుగా చెల్లించి, లాటరీలో పొందిన ఇళ్లను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. సంక్రాంతి నాటికి ఇళ్లను పేదలకు స్వాధీనం చేయాలని... లేదంటే లబ్ధిదారులే స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు.

రాజోలు నియోజకవర్గంలో...

పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేశారు. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో తెదేపా పిలుపుమేరకు నా ఇల్లు- నాకు ఇవ్వాలి, నా ఇంటి స్థలం-నా సొంతం పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఇదీ చదవండి:
బండారులంకలో మంత్రి పినిపే విశ్వరూప్ పాదయాత్ర

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు. పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. అర్హత గల పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు వివిధ డిమాండ్​లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ మృత్యుంజయరావుకు అందజేశారు.

కొత్తపేట నియోజక వర్గంలో..

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్​లో ఉన్న గృహ నిర్మాణ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. పేదలకు ఉచితంగా రెండు సెంట్ల భూమి ఇవ్వాలని కోరుతూ మండల అధికారులకు వినతి పత్రాలను అందించారు.

పెద్దాపురం నియోజకవర్గంలో...

పెద్దాపురం నియోజకవర్గంలో లబ్ధిదారులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు తక్షణం పంపిణీ చేయాలని సామర్లకోట పట్టణం అమ్మణామ్మ గృహ సముదాయం వద్ద తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ‘నా ఇల్లు - నా సొంతం’ పేరుతో ధర్నా నిర్వహించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం తెదేపా ప్రభుత్వం ఇళ్లను నిర్మించిందని చినరాజప్ప తెలిపారు. వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేస్తే తెదేపాకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో వైకాపా ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు హాయంలో కట్టించారనే కారణంగానే పేదలకు ఇళ్లు అప్పగించకుండా సీఎం జగన్‌ వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏడాదికి 5 లక్షల ఇళ్లు ఏవి?

17 నెలల పాలనలో ఒక్క ఇల్లు కూడా ఎందుకు నిర్మించలేకపోయారని రాజప్ప ప్రశ్నించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని వైకాపా మేనిఫెస్టోలో చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. తెదేపా హాయాంలో రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలో ఇళ్లు మంజూరు చేశామన్నారు.

58 వేల ఎకరాల సంగతేంటి..?

ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి 60 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించిందని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. అందులో కోర్టులో కేసులున్నది రెండు వేల ఎకరాలపైనేనని వెల్లడించారు. మిగతా 58 వేల ఎకరాల్లో ఇళ్లపట్టాలు ఎందుకివ్వడం లేదని జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై ‘నా ఇల్లు-నా సొంతం, నా స్థలం-నాకివ్వాలి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

వాళ్ల ఇళ్లను వాళ్లే స్వాధీనం చేసుకుంటారు...

సెంటు పట్టా స్కీమ్‌లో 4 వేల కోట్ల అవినీతి జరిగిందని చినరాజప్ప ఆరోపించారు. ముడుపుల కోసం, వాటాల కోసమే పట్టాల పంపిణీలో వైకాపా నేతలు జాప్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. కలెక్షన్ల కోసమే పంపిణీని ఆపేశారని.. ఆ నెపాన్ని తెదేపాపై నెట్టాలనే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు స్పష్టం చేశారు. తమ కష్టార్జితాన్ని డిపాజిట్లుగా చెల్లించి, లాటరీలో పొందిన ఇళ్లను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. సంక్రాంతి నాటికి ఇళ్లను పేదలకు స్వాధీనం చేయాలని... లేదంటే లబ్ధిదారులే స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు.

రాజోలు నియోజకవర్గంలో...

పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేశారు. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో తెదేపా పిలుపుమేరకు నా ఇల్లు- నాకు ఇవ్వాలి, నా ఇంటి స్థలం-నా సొంతం పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఇదీ చదవండి:
బండారులంకలో మంత్రి పినిపే విశ్వరూప్ పాదయాత్ర

Last Updated : Nov 6, 2020, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.