తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలం సుందరపల్లిలో 12 గంటల నిరాహార దీక్షలో రామచంద్రపురం నియోజకవర్గ తెదేపా సీనియర్ నాయుకుడు సిరిరెడ్డి సత్తిబాబు ఫాల్గొని సంఘీభావం తెలిపారు. లాక్డౌన్ సమయంలో పనుల్లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు తక్షణం రూ.5000 ఆర్థిక సాయం చేయాలని... మూసివేసిన అన్న క్యాంటిన్లు తెరవాలని.. చంద్రన్న బీమా పథకాన్ని పునద్దిరించాలని డిమాండ్ చేశారు. ధ్యానం, పత్తి, మిర్చి, పండ్ల ఉత్పత్తులను ప్రభుత్వమే కొని రైతులను అందుకోవాలని కోరారు. వైద్య సిబ్బందికి పోలీసులకు కరోనా రక్షణ కిట్లు తక్షణమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ఇది చదవండి 'లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి'