ETV Bharat / state

భక్తులు ఇబ్బందులు పడకూడదు: రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్

author img

By

Published : Apr 7, 2021, 7:34 PM IST

తూర్పు గోదావరి జిల్లా చింతలూరు నూకాంబికా అమ్మవారిని... రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్, డీఎస్పీ దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి జాతర ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

sub collector visit temple
రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చింతలూరులో... వెలసిన శ్రీ నూకాంబిక అమ్మవారిని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, డీఎస్పీ బాలచంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సబ్ కలెక్టర్, డీఎస్పీలకు.. పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం.. నెల రోజుల పాటు జరిగే జాతరపై.. ముఖ్య శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. చిన్నపిల్లలతో భక్తులు వస్తారని.. కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూ.. సౌకర్యవంతమైన దర్శనం జరిగేలా చూడాలని చెప్పారు.

జాతర సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, రూట్ మ్యాప్​లను సబ్ కలెక్టర్, డీఎస్పీ పరిశీలించారు. ఆలయాన్ని, పరిసరాలను ప్రతిరోజూ శానిటేషన్ చేయించాలని.. పంచాయతీ అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని.. మంచినీరు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని.. ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు.

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చింతలూరులో... వెలసిన శ్రీ నూకాంబిక అమ్మవారిని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, డీఎస్పీ బాలచంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సబ్ కలెక్టర్, డీఎస్పీలకు.. పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం.. నెల రోజుల పాటు జరిగే జాతరపై.. ముఖ్య శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. చిన్నపిల్లలతో భక్తులు వస్తారని.. కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూ.. సౌకర్యవంతమైన దర్శనం జరిగేలా చూడాలని చెప్పారు.

జాతర సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, రూట్ మ్యాప్​లను సబ్ కలెక్టర్, డీఎస్పీ పరిశీలించారు. ఆలయాన్ని, పరిసరాలను ప్రతిరోజూ శానిటేషన్ చేయించాలని.. పంచాయతీ అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని.. మంచినీరు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని.. ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు.

ఇదీ చదవండి:

జిల్లాలో... సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.