ETV Bharat / state

అనపర్తిలో తెరుచుకున్న ప్రాథమిక పాఠశాల - అనపర్తిలో తెరుచుకున్న పాఠశాలలు

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. దీంతో అన్నీ విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ ఏడాది విద్యాసంస్థలు కరోనా వ్యాప్తితో ఇంకా ప్రారంభం కాలేదు. లాక్​డౌన్ అమలవుతున్న వేళ అనపర్తిలో ఓ ప్రాథమిక పాఠశాలను తెరిచారు. విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు.

schools open
schools open
author img

By

Published : Jun 17, 2020, 10:54 AM IST

కరోనా ప్రభావం వల్ల గత విద్యా సంవత్సరం ముగియకుండా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. నూతన విద్యా సంవత్సరం ఆరంభం సైతం వాయిదా పడింది. అయిదో విడత లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం సునందనపేటలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలను మంగళవారం తెరిచారు. పలువురు విద్యార్థులు పాఠశాలకు వెళ్లారు. కరోనా ఉద్ధృతి ఉన్నా పాఠశాలను తెరవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై అనపర్తి మండల విద్యాశాఖాధికారిణి విజయకుమారిని ఈనాడు వివరణ కోరగా జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు మంగళవారం, 6, 7 తరగతులు బుధవారం, 8, 9, 10 తరగతులకు శుక్రవారం ఉపాధ్యాయులు హాజరవ్వాలని, దూరదర్శన్‌ ద్వారా ప్రసారమవుతున్న బ్రిడ్జి కోర్సు, 6 నుంచి 10 తరగతుల పాఠ్యాంశాలల్లోని విద్యార్థులకు సందేహాలు ఉంటే వారానికి ఒక్క రోజు పాఠశాలల్లోనే నివృత్తి చేయాలని పేర్కొన్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో బ్రిడ్జి కోర్సు మూల్యాంకన తరగతులను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తెలిపింది.

కరోనా ప్రభావం వల్ల గత విద్యా సంవత్సరం ముగియకుండా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. నూతన విద్యా సంవత్సరం ఆరంభం సైతం వాయిదా పడింది. అయిదో విడత లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం సునందనపేటలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలను మంగళవారం తెరిచారు. పలువురు విద్యార్థులు పాఠశాలకు వెళ్లారు. కరోనా ఉద్ధృతి ఉన్నా పాఠశాలను తెరవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై అనపర్తి మండల విద్యాశాఖాధికారిణి విజయకుమారిని ఈనాడు వివరణ కోరగా జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు మంగళవారం, 6, 7 తరగతులు బుధవారం, 8, 9, 10 తరగతులకు శుక్రవారం ఉపాధ్యాయులు హాజరవ్వాలని, దూరదర్శన్‌ ద్వారా ప్రసారమవుతున్న బ్రిడ్జి కోర్సు, 6 నుంచి 10 తరగతుల పాఠ్యాంశాలల్లోని విద్యార్థులకు సందేహాలు ఉంటే వారానికి ఒక్క రోజు పాఠశాలల్లోనే నివృత్తి చేయాలని పేర్కొన్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో బ్రిడ్జి కోర్సు మూల్యాంకన తరగతులను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తెలిపింది.

ఇదీ చదవండి: భారత్​, చైనాలు సంయమనం పాటించాలి: ఐరాస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.