ETV Bharat / state

'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ

తనకు నక్సలైటుగా మారిపోయే అవకాశం కల్పించాలని కోరుతూ.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు ప్రసాద్​ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు లేఖ రాశాడు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు తనకు పోలీస్​ స్టేషన్​లో శిరోముండనం చేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో ఏ7 అయిన ఎస్సైపై తప్ప.. మిగిలిన ఏ1 నుంచి ఏ6 అయిన.. వైకాపాకు చెందిన నేతలపై చర్యలు తీసుకోలేదని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని లేఖలో కోరాడు.

author img

By

Published : Aug 10, 2020, 9:15 PM IST

Updated : Aug 10, 2020, 9:35 PM IST

'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ
'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ
నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ

తనకు నక్సలైటుగా మారిపోయేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామానికి చెందిన దళిత యువకుడు ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పోలీస్ స్టేషన్​లో తనకు శిరోముండనం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా.. బాధ్యులపై ఇంకా చర్యలు తీసుకోలేదని వాపోయాడు.

ఈ ఘటనలో ఏ1 నుంచి ఏ7 వరకూ కేసులు నమోదు చేశారని... ఏ7 అయిన ఎస్సైపై చర్యలు తీసుకున్నప్పటికీ.. వైకాపాకు చెందిన మిగిలిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నాడు. వారిపైనా చర్యలు తీసుకొని.. తనకు న్యాయం చెయ్యాలని ప్రసాద్​ లేఖలో కోరాడు.

ఇదీ చూడండి..

ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది: తెలంగాణ సీఎం కేసీఆర్​

నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ

తనకు నక్సలైటుగా మారిపోయేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామానికి చెందిన దళిత యువకుడు ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పోలీస్ స్టేషన్​లో తనకు శిరోముండనం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా.. బాధ్యులపై ఇంకా చర్యలు తీసుకోలేదని వాపోయాడు.

ఈ ఘటనలో ఏ1 నుంచి ఏ7 వరకూ కేసులు నమోదు చేశారని... ఏ7 అయిన ఎస్సైపై చర్యలు తీసుకున్నప్పటికీ.. వైకాపాకు చెందిన మిగిలిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నాడు. వారిపైనా చర్యలు తీసుకొని.. తనకు న్యాయం చెయ్యాలని ప్రసాద్​ లేఖలో కోరాడు.

ఇదీ చూడండి..

ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది: తెలంగాణ సీఎం కేసీఆర్​

Last Updated : Aug 10, 2020, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.