ETV Bharat / state

సైకత శిల్పాలు... ఎన్నెన్నో భావాలకు ప్రతిరూపాలు - rangampeta sand artist news

'తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు' అన్నది భర్తృహరి సుభాషితం. ఇసుకను పిండితే తైలం రాకపోవచ్చు కానీ ఇసుక రేణువులు ఒకటై ఆయన చేతిలో పడితే అందమైన ఆకృతిని రూపు దాలుస్తాయి. సమాజంలోని దుష్టత్వాన్ని చీల్చి చెండాడుతాయి. నేడు జరుగుతున్న అన్యాయాల గురించి ఆయన కళాఖండాలు సందేశానిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఆయనే తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన సైకతశిల్పి దేవుని శ్రీనివాస్. శిల్పకళను తన ప్రవృత్తిగా ఎంచుకున్న శ్రీనివాస్ గురించి... ఆయన సైకతశిల్పాల గురించి తెలుసుకుందామా..!

అతని సైకత శిల్పాలు... సందేశాన్నిచ్చే రూపాలు
అతని సైకత శిల్పాలు... సందేశాన్నిచ్చే రూపాలు
author img

By

Published : Mar 8, 2020, 11:12 AM IST

అతని సైకత శిల్పాలు... సందేశాన్నిచ్చే రూపాలు

దేవిన శ్రీనివాస్ పుట్టింది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామం. వ్యవసాయ కుటుంబమైన మాణిక్యం, సుబ్బారావు దంపతులకు 1976లో జన్మించిన శ్రీనివాస్ చిన్ననాటి నుంచి చదువుతోపాటు చిత్రకళపై ఆసక్తి కనపరిచేవారు. బడిలో చదివే రోజుల్లో కరణం నూకరాజు అనే డ్రాయింగ్ టీచర్ ప్రోత్సాహంతో చిత్రకళపై ప్రత్యేక దృష్టి పెట్టి నేర్చుకున్నారు. పెద్దాపురం మహారాణి కళాశాలలో చేరి మరో రెండేళ్లు ఆయన వద్ద శిక్షణ తీసుకున్నారు. అదే సమయంలో చిత్రకళలో ఎన్నో బహుమతులు అందుకున్నారు.

డిగ్రీ చదువుతున్న సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చిత్రకళను పక్కన పెట్టి పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక వ్యవసాయం చేస్తూనే పెళ్లి మండపాల డెకరేషన్, పూల అలంకరణ వృత్తిగా ఎంచుకున్నారు. మరోవైపు నాటక సమాజంలో చేరి నటుడిగా పెద్దల ప్రశంసలు అందుకున్నారు. గణపతి నవరాత్రుల్లో స్నేహితులతో కలిసి రంభతో గణపతి విగ్రహాన్ని తయారు చేసి డ్రై ఫ్రూట్స్​తో అందంగా అలంకరించారు. అప్పటినుంచి వస్తువులతో రూపాలు తయారు చేయడం ప్రారంభించారు.

కొంతకాలం పెన్సిల్​, సబ్బులు, చాక్ పీస్​లపై బొమ్మలు గీశారు. ప్రముఖ సైకతశిల్పి పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పాలు ఛాయాచిత్రాలను ఈనాడు పత్రికల్లో చూసి స్ఫూర్తి పొంది సందేశాత్మక శిల్పాల ఆవిష్కరణకు పూనుకున్నారు. దానికోసం ఎంతో సాధన చేశారు. ఇప్పుడు తన చేతిలో ఇసుక తిన్నెలు కొత్త సోయగాలతో కనువిందు చేస్తున్నాయి. సందర్భాన్ని బట్టి సందేశాత్మక శిల్పాలు ఆయన చేతిలో రూపుదాల్చుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బెస్ట్ ఎక్స్​లెన్స్​ అవార్డును అందుకున్న ఏకైక వ్యక్తి దేవుని శ్రీనివాస్.

ఇదీ చూడండి: కళాభిషేకం.. కళాకారుల సంబరం

అతని సైకత శిల్పాలు... సందేశాన్నిచ్చే రూపాలు

దేవిన శ్రీనివాస్ పుట్టింది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామం. వ్యవసాయ కుటుంబమైన మాణిక్యం, సుబ్బారావు దంపతులకు 1976లో జన్మించిన శ్రీనివాస్ చిన్ననాటి నుంచి చదువుతోపాటు చిత్రకళపై ఆసక్తి కనపరిచేవారు. బడిలో చదివే రోజుల్లో కరణం నూకరాజు అనే డ్రాయింగ్ టీచర్ ప్రోత్సాహంతో చిత్రకళపై ప్రత్యేక దృష్టి పెట్టి నేర్చుకున్నారు. పెద్దాపురం మహారాణి కళాశాలలో చేరి మరో రెండేళ్లు ఆయన వద్ద శిక్షణ తీసుకున్నారు. అదే సమయంలో చిత్రకళలో ఎన్నో బహుమతులు అందుకున్నారు.

డిగ్రీ చదువుతున్న సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చిత్రకళను పక్కన పెట్టి పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక వ్యవసాయం చేస్తూనే పెళ్లి మండపాల డెకరేషన్, పూల అలంకరణ వృత్తిగా ఎంచుకున్నారు. మరోవైపు నాటక సమాజంలో చేరి నటుడిగా పెద్దల ప్రశంసలు అందుకున్నారు. గణపతి నవరాత్రుల్లో స్నేహితులతో కలిసి రంభతో గణపతి విగ్రహాన్ని తయారు చేసి డ్రై ఫ్రూట్స్​తో అందంగా అలంకరించారు. అప్పటినుంచి వస్తువులతో రూపాలు తయారు చేయడం ప్రారంభించారు.

కొంతకాలం పెన్సిల్​, సబ్బులు, చాక్ పీస్​లపై బొమ్మలు గీశారు. ప్రముఖ సైకతశిల్పి పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పాలు ఛాయాచిత్రాలను ఈనాడు పత్రికల్లో చూసి స్ఫూర్తి పొంది సందేశాత్మక శిల్పాల ఆవిష్కరణకు పూనుకున్నారు. దానికోసం ఎంతో సాధన చేశారు. ఇప్పుడు తన చేతిలో ఇసుక తిన్నెలు కొత్త సోయగాలతో కనువిందు చేస్తున్నాయి. సందర్భాన్ని బట్టి సందేశాత్మక శిల్పాలు ఆయన చేతిలో రూపుదాల్చుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బెస్ట్ ఎక్స్​లెన్స్​ అవార్డును అందుకున్న ఏకైక వ్యక్తి దేవుని శ్రీనివాస్.

ఇదీ చూడండి: కళాభిషేకం.. కళాకారుల సంబరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.