ETV Bharat / state

ఎడ్లబండిని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు మృతి.. మరో నలుగురికి తీవ్రగాయాలు - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా బొర్రంపాలెం వద్ద.. ఎడ్లబండిని టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో.. ఇద్దరు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

road accident
road accident
author img

By

Published : Apr 10, 2021, 9:07 AM IST

ఎడ్లబండిని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు మృతి.. మరో నలుగురికి తీవ్రగాయాలు

తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం బొర్రంపాలెం వద్ద జాతీయ రహదారిపై ఎడ్ల బండిని వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సీతానగరం మండలం రఘుదేవపురం నుంచి పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ జాతరకు ఎడ్ల బండిపై భక్తులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

రఘుదేవపురానికి చెందిన పెద కాపు (55), నర్సాపురానికి చెందిన వీర వెంకటరావు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఒక ఎద్దు చనిపోగా మరో ఎద్దు తీవ్రంగా గాయపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

టీకా పంపిణీలో అసమానత్వంపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన

ఎడ్లబండిని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు మృతి.. మరో నలుగురికి తీవ్రగాయాలు

తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం బొర్రంపాలెం వద్ద జాతీయ రహదారిపై ఎడ్ల బండిని వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సీతానగరం మండలం రఘుదేవపురం నుంచి పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ జాతరకు ఎడ్ల బండిపై భక్తులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

రఘుదేవపురానికి చెందిన పెద కాపు (55), నర్సాపురానికి చెందిన వీర వెంకటరావు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఒక ఎద్దు చనిపోగా మరో ఎద్దు తీవ్రంగా గాయపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

టీకా పంపిణీలో అసమానత్వంపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.