అందరూ నవ్వుతూ, సరదాగా ప్రయాణం చేస్తున్నవేళ.. రోడ్డు ప్రమాదం వారి జీవితాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. మూడేళ్ల చిన్నారి తల్లిదండ్రులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై జరిగింది. గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొని తల్లిదండ్రులు మృతి చెందగా..మూడేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తునికి సమీపంలో డెక్కన్ కెమికల్స్లో పని చేస్తున్న కరీం... వారి స్వగ్రామం రాజమహేంద్రవరం నుంచి తునికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కరీం అక్కడికక్కడే మృతిచెందగా.. అతని భార్య ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. మూడేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండటం చూసి చిన్నారి రోదించిన తీరు.. అందరినీ కంటతడి పెట్టించింది.
ఇదీ చూడండి. మల వ్యర్థాల శుద్ధీకరణ దిశగా ముందడుగు