ETV Bharat / state

'రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్​​గా తీర్చిదిద్దటమే లక్ష్యం'

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్​గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ ధ్యేయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

author img

By

Published : Aug 23, 2019, 11:13 PM IST

ఆళ్లనాని
రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్​​గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యం

వైద్యం ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని జనవరి ఒకటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 3నెలల పాటు లోటుపాట్లను పరిశీలించి దశలవారీగా అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్​గా మార్చటమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

కాకినాడలో జిల్లా ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్​ చంద్రబోస్, కన్నబాబు, పినిపే విశ్వరూప్ , వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేదలకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. వైద్యుల కొరత, వైద్య పరికరాలు సరిగా లేకపోవటంతో పేదలకు ప్రభుత్వ వైద్యం అందటం లేదని స్థానిక నేతలు, సిబ్బంది తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో పడకలు పెంచటంతోపాటు, సమస్యలు పరిష్కరించాలని మంత్రికి, కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. అధికారులు ఇప్పటినుంచైనా ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువయ్యేలా చూడాలని సూచించారు.

ఇది కూడా చదవండి.

'ఇలా చేస్తే ప్రజలకు నమ్మకం పోతుంది'

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్​​గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యం

వైద్యం ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని జనవరి ఒకటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 3నెలల పాటు లోటుపాట్లను పరిశీలించి దశలవారీగా అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్​గా మార్చటమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

కాకినాడలో జిల్లా ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్​ చంద్రబోస్, కన్నబాబు, పినిపే విశ్వరూప్ , వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేదలకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. వైద్యుల కొరత, వైద్య పరికరాలు సరిగా లేకపోవటంతో పేదలకు ప్రభుత్వ వైద్యం అందటం లేదని స్థానిక నేతలు, సిబ్బంది తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో పడకలు పెంచటంతోపాటు, సమస్యలు పరిష్కరించాలని మంత్రికి, కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. అధికారులు ఇప్పటినుంచైనా ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువయ్యేలా చూడాలని సూచించారు.

ఇది కూడా చదవండి.

'ఇలా చేస్తే ప్రజలకు నమ్మకం పోతుంది'

Intro:Ap_Vsp_91_23_Krishnashtami_bommalakoluvu_Ab_AP10083
కంట్రిబ్యూటర్ : కె. కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) శ్రీ కృషుని జన్మాష్టమి సందర్భంగా విశాఖలో ఓ మహిళ తన ఇంట్లో కృష్ణుని బాలలీలలు సారాంశాన్ని వివరిస్తూ బొమ్మలను సుందరంగా అలంకరించారు.


Body:ఈస్ట్ పాయింట్ కాలనీలో నివాసం ఉంటున్న శాంతి అనే మహిళకు శ్రీకృష్ణుడు అంటే ఎంతో అభిమానం. తన అభిమానాన్ని, భక్తిని చాటుకోవడంలో భాగంగా ప్రతి ఏడాది కృష్ణాష్టమి రోజున తన ఇంటిని సుందరంగా అలంకరించి ఆ కాలనీలో ఉన్న ముత్తయిదువులను పిలిచి పారాయణ కార్యక్రమం నిర్వహిస్తారు. తన ఇంట్లోని మహిళలంతా ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Conclusion:ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి ఇష్టమైన పాలహారాలు, పండ్లు, వివిధ రకాల పిండి పదార్థాలతో చేసిన వంటకాలను అక్కడ ప్రతిష్టించిన విగ్రహానికి నైవేద్యంగా సమర్పిపిస్తారు. తన భక్తిని చూసి ఎంతోమంది అతి పురాతన కృషునికి సంబంధించిన విగ్రహాలను తనకు సమర్పించారని ఆమె తెలిపారు. ప్రతి ఏడాది ఈ పండుగను ఇంతమంది మహిళలతో కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.


బైట్: శాంతి, నిర్వాహకులు గృహిణి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.