తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాణిలంకలోని వరద ముంపు ప్రాంతాల్లో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ పర్యటించారు. సామాజిక భవనాల్లో ఉంటున్న బాధితుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. తదితర విషయాలను అడిగి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వరద బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలను కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి. సీఎం గారు మీరు అభివృద్ధి అంటుంటే కామెడీగా ఉంది..!