ETV Bharat / state

గట్ల వద్ద గంజాయి దాస్తే.. పోలీసులు పట్టుకున్నారు...

author img

By

Published : Jul 7, 2021, 11:51 AM IST

ఓ ఇద్దరు గంజాయి తెచ్చి..గ్రామశివారులో గట్ల వద్ద దాచారు. అక్కడికి ఎవరూ రారు అనుకొని ఆ ఇద్దరు గంజాయిని .. చెరో సగం పంచుకుంటుండగా.. ఊహించని ఘటన ఎదురైంది. ఎందుకంటే.. ఆ సీన్​లోకి పోలీసులు ఎంటర్​ అయ్యారు. షాకే కదా మరి.. వారు పారిపోయే ప్రయత్నం చేయగా తరువాత పోలీసులు వారిని పట్టుకున్నారు.

police take over marijuana at anaparthi
అనపర్తిలో ఆరు కిలోల గంజాయి పట్టివేత

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గంజాయి పంచుకుంటుంటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ భాస్కరరావు ఈ వివరాలు వెల్లడించారు.

అనపర్తి మండలానికి చెందిన మేడిశెట్టి సుభాష్(23), గొలుగురి మణికంఠ రెడ్డి(26)లు మద్యం, గంజాయికి బానిసలయ్యారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పదిరోజుల క్రితం ద్విచక్రవాహనంపై విశాఖ జిల్లా చింతపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద 6 కేజీల గంజాయిని సుమారు రూ.10వేలకు కొనుగోలు చేశారు. దానిని అనపర్తి శివారు ఒక పొలం గట్టువద్దనున్న చెట్ల వద్ద దాచారు.

మంగళవారం ఆ ఇద్దరు గంజాయిని పంచుకుంటుండగా... పోలీసులు తమకు వచ్చిన సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు కిలోల గంజాయి, రెండు సెల్​పోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ భాస్కరరావు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని అన్నారు. అనపర్తిలో ఎక్కువమంది యువకులు గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు బానిసలయ్యారని.. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: తెలంగాణ: గాంధీభవన్​లో వేడుకగా రేవంత్​ రెడ్డి ప్రమాణస్వీకారం..

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గంజాయి పంచుకుంటుంటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ భాస్కరరావు ఈ వివరాలు వెల్లడించారు.

అనపర్తి మండలానికి చెందిన మేడిశెట్టి సుభాష్(23), గొలుగురి మణికంఠ రెడ్డి(26)లు మద్యం, గంజాయికి బానిసలయ్యారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పదిరోజుల క్రితం ద్విచక్రవాహనంపై విశాఖ జిల్లా చింతపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద 6 కేజీల గంజాయిని సుమారు రూ.10వేలకు కొనుగోలు చేశారు. దానిని అనపర్తి శివారు ఒక పొలం గట్టువద్దనున్న చెట్ల వద్ద దాచారు.

మంగళవారం ఆ ఇద్దరు గంజాయిని పంచుకుంటుండగా... పోలీసులు తమకు వచ్చిన సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు కిలోల గంజాయి, రెండు సెల్​పోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ భాస్కరరావు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని అన్నారు. అనపర్తిలో ఎక్కువమంది యువకులు గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు బానిసలయ్యారని.. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: తెలంగాణ: గాంధీభవన్​లో వేడుకగా రేవంత్​ రెడ్డి ప్రమాణస్వీకారం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.