ETV Bharat / state

మారేడుమిల్లిలో రూ.2.15 లక్షల విలువైన తెలంగాణ మద్యం పట్టివేత - మారెడుమిల్లిలో పోలీసుల తనిఖీలు

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో పోలీసులు పట్టుకున్నారు. రూ.2.15 లక్షల విలువైన 1820 బాటిళ్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

police seized telangana  alcohol at  maredumilli
తెలంగాణ మద్యం పట్టివేత
author img

By

Published : Jul 2, 2020, 2:40 PM IST

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కాటవరం గ్రామం నుంచి జిల్లాలోని రావులపాలెం గ్రామానికి ట్రక్కులో మద్యాన్ని తరలిస్తుండగా..సీఐ రవికుమార్, ఎస్సై.రామకృష్ణ పట్టుకున్నారు. రూ.2.15 లక్షల విలువైన 1820 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జొన్నాడకు చెందిన చంద్రశేఖర్, రాజబాబును పోలీసులు అరెస్టు చేశారు. దీంతోపాటు వాహనాన్ని సీజ్ చేశారు. ఈ మద్యం విలువ తెలంగాణలో రూ.2.15 లక్షలు కాగా.. రాష్ట్రంలో రూ.3.77 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కాటవరం గ్రామం నుంచి జిల్లాలోని రావులపాలెం గ్రామానికి ట్రక్కులో మద్యాన్ని తరలిస్తుండగా..సీఐ రవికుమార్, ఎస్సై.రామకృష్ణ పట్టుకున్నారు. రూ.2.15 లక్షల విలువైన 1820 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జొన్నాడకు చెందిన చంద్రశేఖర్, రాజబాబును పోలీసులు అరెస్టు చేశారు. దీంతోపాటు వాహనాన్ని సీజ్ చేశారు. ఈ మద్యం విలువ తెలంగాణలో రూ.2.15 లక్షలు కాగా.. రాష్ట్రంలో రూ.3.77 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కారును ఢీకొట్టిన కంటైనర్​... నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.