ETV Bharat / state

కాకినాడకు పవన్... జనసైనికులకు పరామర్శ..!

author img

By

Published : Jan 13, 2020, 5:42 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రేపు పర్యటించనున్నారు. రేపు ఉదయం దిల్లీ నుంచి నేరుగా విశాఖకు వచ్చి... అక్కడి నుంచి కాకినాడకు వెళ్లనున్నారు. వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడిన జనసైనికులను పవన్ పరామర్శించనున్నారు.

pawan kalyan
pawan kalyan

దిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... రేపు ఉదయం 11 గంటలకు విశాఖ రానున్నారు. విశాఖ నుంచి నేరుగా కాకినాడ వెళ్లనున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్​పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఆదివారం జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ ఆందోళన ఉద్రిక్తతంగా మారింది. జనసేన కార్యకర్తలపై ద్వారంపూడి అనుచరులు, వైకాపా కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు పవన్... కాకినాడ వస్తున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు.

ఇదీ చదవండి :

దిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... రేపు ఉదయం 11 గంటలకు విశాఖ రానున్నారు. విశాఖ నుంచి నేరుగా కాకినాడ వెళ్లనున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్​పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఆదివారం జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ ఆందోళన ఉద్రిక్తతంగా మారింది. జనసేన కార్యకర్తలపై ద్వారంపూడి అనుచరులు, వైకాపా కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు పవన్... కాకినాడ వస్తున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు.

ఇదీ చదవండి :

వైకాపా వర్సెస్ జనసేన.. కాకినాడలో ఉద్రిక్తత

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.