ETV Bharat / state

పట్టపగలే వృద్ధురాలి మెడలో ఆభరణాల చోరీ

author img

By

Published : Nov 5, 2020, 7:20 PM IST

వృద్ధురాలి మెడలో 22 కాసుల బంగారు ఆభరణాలను చోరీ చేశాడో అగంతకుడు. తూర్పు గోదావరి కొత్తపేటలో.. నడవలేని ఆ మహిళ ముఖంపై కొట్టి గొలుసు లాక్కుని పారిపోయాడు. తెలిసిన వారనుకుని చూస్తుండగానే చోరీ జరిగిపోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

chain snatching
వివరాలు సేకరిస్తున్న పోలీసులు

పట్టపగలే వృద్దురాలి మెడలోని 22 కాసుల బంగారు ఆభరణాలను.. గుర్తుతెలియని వ్యక్తి లాక్కుపోయిన ఘటన.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జరిగింది. కౌశిక్‌రోడ్డులో నివాసముండే లక్ష్మీకాంతం నడవలేదు. మధ్యహ్న సమయంలో భర్త వంట చేస్తుండగా.. ఆమె ఇంటి హాల్లో కూర్చుని ఉంది.

ముఖానికి గుడ్డకట్టుకున్న ఓ వ్యక్తి ఇంట్లోకి రాగా.. తెలిసిన వారనుకుని మాట్లాడే ప్రయత్నం చేసింది. అంతలోనే ముఖంపై కొట్టి ఒక్కసారిగా మెడలోలోని నల్లపూసల తాడు, గొలుసు లాక్కుని పారిపోయాడని బాధితురాలు వాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

పట్టపగలే వృద్దురాలి మెడలోని 22 కాసుల బంగారు ఆభరణాలను.. గుర్తుతెలియని వ్యక్తి లాక్కుపోయిన ఘటన.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జరిగింది. కౌశిక్‌రోడ్డులో నివాసముండే లక్ష్మీకాంతం నడవలేదు. మధ్యహ్న సమయంలో భర్త వంట చేస్తుండగా.. ఆమె ఇంటి హాల్లో కూర్చుని ఉంది.

ముఖానికి గుడ్డకట్టుకున్న ఓ వ్యక్తి ఇంట్లోకి రాగా.. తెలిసిన వారనుకుని మాట్లాడే ప్రయత్నం చేసింది. అంతలోనే ముఖంపై కొట్టి ఒక్కసారిగా మెడలోలోని నల్లపూసల తాడు, గొలుసు లాక్కుని పారిపోయాడని బాధితురాలు వాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:

రంగులు వేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన లారీ...ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.