ETV Bharat / state

student sucide: వసతి గృహంలో నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణం

వసతి గృహంలో నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

author img

By

Published : Aug 31, 2021, 7:07 AM IST

వసతి గృహంలో నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణం
వసతి గృహంలో నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కపిలేశ్వరం మండలం టేకి గ్రామానికి చెందిన దిడ్ల ఉమామహేశ్వరి(18) కాకినాడ ప్రతాప్ నగర్​లోని నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం మెుదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం తరగతులకు హాజరైన ఆమె మధ్యాహ్నం అనుమతి తీసుకుని తన గదికి వెళ్లి ఉరేసుకున్నారు. పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్న మరో విద్యార్థిని ఈ విషయాన్ని గమనించి ప్రిన్సిపల్​కు తెలిపారు.

ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ ఈశ్వరుడు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉమామహేశ్వరి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కల్పించుకుని న్యాయం చేస్తామని చెప్పటంతో ఆందోళన విరమించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కపిలేశ్వరం మండలం టేకి గ్రామానికి చెందిన దిడ్ల ఉమామహేశ్వరి(18) కాకినాడ ప్రతాప్ నగర్​లోని నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం మెుదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం తరగతులకు హాజరైన ఆమె మధ్యాహ్నం అనుమతి తీసుకుని తన గదికి వెళ్లి ఉరేసుకున్నారు. పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్న మరో విద్యార్థిని ఈ విషయాన్ని గమనించి ప్రిన్సిపల్​కు తెలిపారు.

ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ ఈశ్వరుడు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉమామహేశ్వరి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కల్పించుకుని న్యాయం చేస్తామని చెప్పటంతో ఆందోళన విరమించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

వాగులో వరద ఉద్ధృతి.. ఇద్దరు యువతులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.