ETV Bharat / state

'ఏపీకి ప్రత్యేక హోదా.. అడ్డుకుంటున్నది ఆ ఎంపీనే'

author img

By

Published : Feb 16, 2022, 7:20 PM IST

MP Bharat on special status : ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా రాకుండా.. భాజపా ఎంపీ జీవీఎల్ అడ్డుకుంటున్నారని ఎంపీ భరత్ ఆరోపించారు. ఈనెల 17న జరగనున్న కేంద్ర హోంశాఖ సమావేశంలో తొలగించిన ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారాని ఎంపీ భరత్ అన్నారు.

MP Bharat
MP Bharat

MP Bharat on special status : తెలుగువారై ఉండి భాజపా ఎంపీ జీవీఎల్ ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారని.. కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ప్రత్యేకహోదా డిలీట్ కావడానికి జీవీఎల్ కారణం అని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. ఈనెల 17న జరగనున్న కేంద్ర హోంశాఖ సమావేశంలో.. ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ కూడా చెప్పారు..
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారాని ఎంపీ భరత్ అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై 22 మంది వైకాపా ఎంపీలు అనేకసార్లు పార్లమెంటులో ప్రస్తావించారని భరత్ తెలిపారు. వైకాపా ఎంపీలు మాట్లాడటం వల్లే ప్రధాని మోదీ ఆంధ్రాకు అన్యాయం జరిగిందని పార్లమెంట్​లో అన్నారని ఎంపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.2,100 కోట్లు రీఎంబర్స్ చేయాల్సి ఉందన్నారు. ఏపీలో కొత్త జాతీయ రహదార్లు వేస్తున్నందుకు కేంద్రానికి ఎంపీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి

Special Status: ప్రత్యేక హోదా లేదు.. నిధుల సమీకరణకు కృషి చేయండి: భాజపా ఎంపీ జీవీఎల్

MP Bharat on special status : తెలుగువారై ఉండి భాజపా ఎంపీ జీవీఎల్ ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారని.. కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ప్రత్యేకహోదా డిలీట్ కావడానికి జీవీఎల్ కారణం అని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. ఈనెల 17న జరగనున్న కేంద్ర హోంశాఖ సమావేశంలో.. ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ కూడా చెప్పారు..
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారాని ఎంపీ భరత్ అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై 22 మంది వైకాపా ఎంపీలు అనేకసార్లు పార్లమెంటులో ప్రస్తావించారని భరత్ తెలిపారు. వైకాపా ఎంపీలు మాట్లాడటం వల్లే ప్రధాని మోదీ ఆంధ్రాకు అన్యాయం జరిగిందని పార్లమెంట్​లో అన్నారని ఎంపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.2,100 కోట్లు రీఎంబర్స్ చేయాల్సి ఉందన్నారు. ఏపీలో కొత్త జాతీయ రహదార్లు వేస్తున్నందుకు కేంద్రానికి ఎంపీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి

Special Status: ప్రత్యేక హోదా లేదు.. నిధుల సమీకరణకు కృషి చేయండి: భాజపా ఎంపీ జీవీఎల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.