తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. పి.గన్నవరం నియోజకవర్గం గుంట్రువారిపేటలో సోమవారం బాలిక కిడ్నాప్నకు గురైంది. రంగంలోకి దిగిన పోలీసులు... విజయవాడలో బాలిక సంయుక్తను గుర్తించారు. అనంతరం అంబాజీపేట పోలీసు స్టేషన్కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు.
బాలిక కిడ్నాప్కు పథకం రచించిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా...కిడ్నాప్నకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీచదవండి