ETV Bharat / state

భార్యను రక్షించి... భర్త మరణం - person died in picchukalanka news

భార్యను కాపాడి.. భర్త మరణించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంకలో జరిగింది. ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోయిన సతీమణిని రక్షించి.. నదిలో భర్త గల్లంతయ్యాడు.

died person
మరణించిన వ్యక్తి
author img

By

Published : Jan 16, 2021, 12:50 PM IST

ప్రమాదవశాత్తు గోదావరిలో పడిన భార్యను కాపాడిన భర్త... నదిలో గల్లంతై మరణించాడు. ఈ ఘటన ఆత్రేయపురం మండలం పిచ్చుకలంకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజమహేంద్రవరం వి.ఎల్‌.పురానికి చెందిన పైడిమర్రి కిషోర్‌బాబు(36), హారిక దంపతులు. పండగపూట సరదాగా గడిపేందుకు పిచ్చుకలంకకు వెళ్లారు.

గోదావరిలోకి దిగిన హారిక.. కాలుజారి నదిలో పడిపోయింది. ఆమెను రక్షించిన కిషోర్​ నీటిలో గల్లంతయ్యాడు. కొద్ది సేపటికి గోదావరిలో ఆయన మృతదేహం లభ్యమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ప్రమాదవశాత్తు గోదావరిలో పడిన భార్యను కాపాడిన భర్త... నదిలో గల్లంతై మరణించాడు. ఈ ఘటన ఆత్రేయపురం మండలం పిచ్చుకలంకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజమహేంద్రవరం వి.ఎల్‌.పురానికి చెందిన పైడిమర్రి కిషోర్‌బాబు(36), హారిక దంపతులు. పండగపూట సరదాగా గడిపేందుకు పిచ్చుకలంకకు వెళ్లారు.

గోదావరిలోకి దిగిన హారిక.. కాలుజారి నదిలో పడిపోయింది. ఆమెను రక్షించిన కిషోర్​ నీటిలో గల్లంతయ్యాడు. కొద్ది సేపటికి గోదావరిలో ఆయన మృతదేహం లభ్యమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి:

జిల్లాలో మూడు వేర్వేరు ఘటనల్లో.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.