ETV Bharat / state

జూన్‌లో.. పునరావాస కాలనీలకు పోలవరం నిర్వాసితులు! - పోలవరం నిర్వాసితులపై వార్తలు

ఈ ఏడాది జూన్‌ నాటికి పోలవరం నిర్వాసితులను సంబంధిత కాలనీలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్​.. సీఎం జగన్​కు చెప్పారు.

houses to plavaram rehablitants on june
పోలవరం నిర్వాసితులపై కలెక్టర్​ సమీక్ష
author img

By

Published : Apr 30, 2020, 12:13 PM IST

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా అధికారులతో తన విడిది కార్యాలయం నుంచి బుధవారం దూరదృశ్య సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జేసీ లక్ష్మీశ, రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్వాసిత కాలనీ గురించి ముఖ్యమంత్రికి కలెక్టర్‌ వివరించారు.

గత ఏడాది గోదావరి వరదల కారణంగా దేవీపట్నం మండలంలోని పలుగ్రామాలు ముంపునకు గురై ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు గుర్తు చేశారు. ఈ ఏడాది జూన్‌ నాటికి నిర్వాసితులను సంబంధిత కాలనీలకు తరలించేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్...‌ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రితో సమావేశం వివరాలు వెల్లడించి.. పనులు త్వరగా జరగాలని ఆదేశించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా అధికారులతో తన విడిది కార్యాలయం నుంచి బుధవారం దూరదృశ్య సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జేసీ లక్ష్మీశ, రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్వాసిత కాలనీ గురించి ముఖ్యమంత్రికి కలెక్టర్‌ వివరించారు.

గత ఏడాది గోదావరి వరదల కారణంగా దేవీపట్నం మండలంలోని పలుగ్రామాలు ముంపునకు గురై ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు గుర్తు చేశారు. ఈ ఏడాది జూన్‌ నాటికి నిర్వాసితులను సంబంధిత కాలనీలకు తరలించేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్...‌ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రితో సమావేశం వివరాలు వెల్లడించి.. పనులు త్వరగా జరగాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

వేడి వాతావరణంలో సామర్థ్యాన్ని కోల్పోతున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.