కరోనా ప్రభావంతో మనువరాలి పెళ్లిని చూడలేకపోయ్యారా ఆ తాత నాన్నమ్మలు. చివరికి బంధువులతో కలిసి అంతర్జాలంలో వీక్షించి ఆశీర్వదించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన వ్యాపారవేత్త చింతా శ్రీనివాస రెడ్డి కుమార్తె ధనలక్ష్మి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్న రామ్ రెడ్డితో వివాహం నిశ్చయించారు. మార్చిలో నిశ్చితార్థం కూడా జరిపారు. అనంతరం వధూవరులు వారి ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లారు. అయితే లాక్ డౌన్ రావడం, ఉద్యోగ రీత్యా స్వదేశానికి రావడం కుదరకపోవడంతో అమెరికాలోనే పెళ్లి చేయాలని అనుకున్నారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు అమెరికా వెళ్లారు. తల్లిదండ్రులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరిపించారు. అయితే వారి వివాహాన్ని తాత నానమ్మలు వీక్షించేందుకు అంతర్జాలంలో లైవ్ ఇవ్వగా వారు బంధువులతో కలిసి వధువు ఇంటివద్దే దీవించారు. స్క్రీన్పై అక్షింతలు వేసి వధూవరులను ఆశ్వీరదించారు.
ఇదీ చదవండి: ఏలూరు పరిధిలో 'ఆరోగ్య అత్యవసర పరిస్థితి' ప్రకటించండి: చంద్రబాబు