ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా.. ఆందోళనలో ప్రజలు - government employees tested positive in prathipadu news

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు కరోనా సోకడం అధికారులను కలవర పెడుతోంది. పోలీసు, రెవెన్యూ, సచివాలయ సిబ్బందికి కరోనా పాజిటివ్​గా రావడంపై సహోద్యోగులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా.. ఆందోళనలో ప్రజలు
ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా.. ఆందోళనలో ప్రజలు
author img

By

Published : Jul 12, 2020, 1:04 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా భయం నెలకొంది. పోలీసు, రెవెన్యూ, సచివాలయ సిబ్బందికి కరోనా లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఏలేశ్వరంలో ఓ కానిస్టేబుల్​కు.. శంఖవరం మండలం కత్తిపూడి సచివాలయం సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంపై సహోద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలకు పనుల నిమిత్తం వెళ్లిన ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా కార్యాలయాలు, పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా భయం నెలకొంది. పోలీసు, రెవెన్యూ, సచివాలయ సిబ్బందికి కరోనా లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఏలేశ్వరంలో ఓ కానిస్టేబుల్​కు.. శంఖవరం మండలం కత్తిపూడి సచివాలయం సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంపై సహోద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలకు పనుల నిమిత్తం వెళ్లిన ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా కార్యాలయాలు, పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి..

కరోనా ప్రభావం... వైకుంఠనాథుని దర్శనానికి తగ్గుతున్న భక్తులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.