ETV Bharat / state

అఖండ గోదావరిలో పేరుకుపోతున్న ఇసుక నిల్వలు

అఖండ గోదావరిలో అపార ఇసుక నిల్వలు పేరుకుపోతున్నాయి. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట ఎగువున అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బ్యారేజీ ఎగువన 3 కిలోమీటర్ల వరకు లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. ఈ అపార నిల్వలను వెలికితీస్తే... అత్యంత చౌకగా అందరి అవసరాలు తీరతాయని నిపుణులు చెబుతున్నారు.

author img

By

Published : Nov 19, 2019, 8:44 AM IST

godavari-barriage
అఖండ గోదావరిలో పేరుకుపోతున్న ఇసుక నిల్వలు

ఉభయగోదావరి జిల్లాల వరదాయని కాటన్ బ్యారేజి పరిసర ప్రాంతాల్లో.... సైకత సిరులు దర్శనం ఇస్తున్నాయి. గోదావరిలో వివిధ ప్రాంతాల్లో అపార ఇసుక మేటలు ఉన్నాయి. 3 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న బ్యారేజీ.... ఇసుక నిక్షేపాలకు నిలయంగా మారింది. ఈ ప్రాంతాల్లో డ్రెడ్జింగ్‌ నిర్వహించి చాలా సంవత్సరాలు కావడం వల్ల... ఇసుక పేరుకుపోయింది. గోదావరిలో ఎక్కడెక్కడ ఎంత పరిమాణంలో నిల్వలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జలవనరులశాఖ కసరత్తు చేస్తోంది. ఇసుక కొరతను తీర్చేందుకు బ్యారేజీ ఎగువున ఈ నెల 14 నుంచి తవ్వకాలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు అనుమతించినా... టెండర్లు పూర్తికాక ప్రక్రియ ప్రారంభం కాలేదు.

గోదావరి నది ప్రవహించే ప్రాంతాల్లో రాజమహేంద్రవరం పరిసరాల్లో దొరికే ఇసుకను నాణ్యమైనదిగా భావిస్తారు. గండ్ర ఇసుక కావడం వల్ల భవన నిర్మాణదారులు కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. చాలా కాలం నుంచి గోదావరిలో అపారమైన ఇసుక నిల్వలు పేరుకుపోయాయని... బయటకు తీయడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇసుక కొరతతో చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నామని... రాజమహేంద్రవరంలో వెంటనే తవ్వకాలు చేపట్టి ఇసుక అందించాలని భవన నిర్మాణదారులు, కార్మికులు కోరుతున్నారు.డ్రెడ్జింగ్‌ నిర్వహించే సమయంలో స్ట్రక్చర్లకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

జేఎన్​యూలో ఉద్రిక్తత.. 100మంది అరెస్ట్​

అఖండ గోదావరిలో పేరుకుపోతున్న ఇసుక నిల్వలు

ఉభయగోదావరి జిల్లాల వరదాయని కాటన్ బ్యారేజి పరిసర ప్రాంతాల్లో.... సైకత సిరులు దర్శనం ఇస్తున్నాయి. గోదావరిలో వివిధ ప్రాంతాల్లో అపార ఇసుక మేటలు ఉన్నాయి. 3 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న బ్యారేజీ.... ఇసుక నిక్షేపాలకు నిలయంగా మారింది. ఈ ప్రాంతాల్లో డ్రెడ్జింగ్‌ నిర్వహించి చాలా సంవత్సరాలు కావడం వల్ల... ఇసుక పేరుకుపోయింది. గోదావరిలో ఎక్కడెక్కడ ఎంత పరిమాణంలో నిల్వలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జలవనరులశాఖ కసరత్తు చేస్తోంది. ఇసుక కొరతను తీర్చేందుకు బ్యారేజీ ఎగువున ఈ నెల 14 నుంచి తవ్వకాలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు అనుమతించినా... టెండర్లు పూర్తికాక ప్రక్రియ ప్రారంభం కాలేదు.

గోదావరి నది ప్రవహించే ప్రాంతాల్లో రాజమహేంద్రవరం పరిసరాల్లో దొరికే ఇసుకను నాణ్యమైనదిగా భావిస్తారు. గండ్ర ఇసుక కావడం వల్ల భవన నిర్మాణదారులు కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. చాలా కాలం నుంచి గోదావరిలో అపారమైన ఇసుక నిల్వలు పేరుకుపోయాయని... బయటకు తీయడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇసుక కొరతతో చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నామని... రాజమహేంద్రవరంలో వెంటనే తవ్వకాలు చేపట్టి ఇసుక అందించాలని భవన నిర్మాణదారులు, కార్మికులు కోరుతున్నారు.డ్రెడ్జింగ్‌ నిర్వహించే సమయంలో స్ట్రక్చర్లకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

జేఎన్​యూలో ఉద్రిక్తత.. 100మంది అరెస్ట్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.