ETV Bharat / state

రోగి పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తున్నాం: డాక్టర్ రమేష్ కిషోర్

తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్‌ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ పాజిటివ్‌ బాధితుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలో జిల్లాలో కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలు ఎలా ఉన్నాయి..? కొవిడ్ ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలను ఎంత వరకు పరిష్కరించారు..? అందుతున్న వైద్య సేవలపై జిల్లా ఆస్పత్రుల వైద్య సేవల సమన్వయకర్త డాక్టర్ రమేష్ కిషోర్​ వివరాలు వెల్లడించారు.

author img

By

Published : Aug 5, 2020, 8:16 PM IST

eastgodavari district  Medical Services Coordinator  Dr. Ramesh Kishore
eastgodavari district Medical Services Coordinator Dr. Ramesh Kishore

కరోనాతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల వైద్య సేవల సమన్వయకర్త డాక్టర్ రమేష్ కిషోర్ అన్నారు. జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న 250 పడకలను 400 కు పెంచామని చెప్పారు. ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులను సమకూర్చామని వివరించారు.

జిల్లా ఆస్పత్రుల వైద్య సేవల సమన్వయకర్త డాక్టర్ రమేష్ కిషోర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

కొవిడ్ కేసులను 3 రకాలుగా పరిగణిస్తూ తగిన విధంగా చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఐసీయూలో ఉంచుతున్నామని చెప్పారు. సిబ్బంది కొరతపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని..రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని స్పష్టం చేశారు. సాధారణ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు.

ఇదీ చదవండి

నవ భారత చరిత్రలో 'ఆగస్టు 5' ఎంతో ప్రత్యేకం

కరోనాతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల వైద్య సేవల సమన్వయకర్త డాక్టర్ రమేష్ కిషోర్ అన్నారు. జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న 250 పడకలను 400 కు పెంచామని చెప్పారు. ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులను సమకూర్చామని వివరించారు.

జిల్లా ఆస్పత్రుల వైద్య సేవల సమన్వయకర్త డాక్టర్ రమేష్ కిషోర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

కొవిడ్ కేసులను 3 రకాలుగా పరిగణిస్తూ తగిన విధంగా చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఐసీయూలో ఉంచుతున్నామని చెప్పారు. సిబ్బంది కొరతపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని..రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని స్పష్టం చేశారు. సాధారణ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు.

ఇదీ చదవండి

నవ భారత చరిత్రలో 'ఆగస్టు 5' ఎంతో ప్రత్యేకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.