ETV Bharat / state

ఊరించినదొకరిని.. వరించినదొకరిని! - పంచాయతీ ఎలెక్షన్లు వార్తలు

వైకాపా మద్దతు దారిని ఏకగ్రీవం చేసేందుకు ఏకంగా.. ఎమ్మెల్యేనే రంగంలోకి దిగారు. అనుకున్నది సాధించారు. ఏకగ్రీవంగా సర్పంచి ఎన్నికైంది. కానీ డమ్మీ అభ్యర్థిగా నామపత్రాలు సమర్పించి ఆమెను పదవి వరించింది! అదెలా అంటే...!

panchayati elections
పంచాయతీ పోరు
author img

By

Published : Feb 6, 2021, 7:11 AM IST

తూర్పుగోదావరి జిల్లా శంఖవరం పంచాయతీలో అనూహ్యం చోటుచేసుకుంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ స్వగ్రామమైన శంఖవరం పంచాయతీని... వైకాపా మద్దతుదారుతో ఏకగ్రీవం చేసుకోవాలన్న ప్రయత్నం ఫలించింది. అయితే ముందు నుంచి అనుకున్న అభ్యర్థి కాకుండా.. డమ్మీగా బలపరచిన అభ్యర్థిని పదవి వరించింది. ఈ పంచాయతీలో ఎమ్మెల్యే పూర్ణచంద్ర.. బందిలి ధనలక్ష్మిని బలపరచగా, బందిలి గన్నియమ్మ డమ్మీ అభ్యర్థిగా నామపత్రాలు సమర్పించారు. ‘ముగ్గురు పిల్లలు’ నిబంధనతో ధనలక్ష్మి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. డమ్మీగా వేసిన గన్నియమ్మ నామపత్రాలు సవ్యంగా ఉండడంతో ఆమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తూర్పుగోదావరి జిల్లా శంఖవరం పంచాయతీలో అనూహ్యం చోటుచేసుకుంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ స్వగ్రామమైన శంఖవరం పంచాయతీని... వైకాపా మద్దతుదారుతో ఏకగ్రీవం చేసుకోవాలన్న ప్రయత్నం ఫలించింది. అయితే ముందు నుంచి అనుకున్న అభ్యర్థి కాకుండా.. డమ్మీగా బలపరచిన అభ్యర్థిని పదవి వరించింది. ఈ పంచాయతీలో ఎమ్మెల్యే పూర్ణచంద్ర.. బందిలి ధనలక్ష్మిని బలపరచగా, బందిలి గన్నియమ్మ డమ్మీ అభ్యర్థిగా నామపత్రాలు సమర్పించారు. ‘ముగ్గురు పిల్లలు’ నిబంధనతో ధనలక్ష్మి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. డమ్మీగా వేసిన గన్నియమ్మ నామపత్రాలు సవ్యంగా ఉండడంతో ఆమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇదీ చదవండి: మన్యంలో ఎన్నికల పోలింగ్‌ సమయం కుదింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.