కోనసీమ తిరుపతిగా పేరు గాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 1,564 మంది దర్శించుకున్నారు. కరోనా నిబంధనలను అనుసరించి భక్తులను ఆలయం లోపలికి అనుమతించారు. ప్రత్యేక దర్శనం ద్వారా రూ.45,300, అన్నప్రసాద విరాళం ఆదాయం రూ.12,947, కేశఖండన ద్వారా రూ.64,422 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు.
ఇదీ చూడండి..