ETV Bharat / state

Adulterated toddy case: జీలుగు కల్లు ఘటన కేసులో నిందితుడు అరెస్టు.. అక్రమ సంబంధమే కారణం..!

author img

By

Published : Feb 8, 2022, 2:53 PM IST

Updated : Feb 8, 2022, 4:07 PM IST

culprits arrested in adulterated toddy case
జీలుగు కల్లు ఘటన కేసులో నిందితుడు అరెస్టు

14:49 February 08

కల్లులో గడ్డిమందు కలిపిన నిందితుడు

Adulterated toddy case: తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం.. లోదొడ్డిలో ఈ నెల 2న జీలుగు కల్లు తాగి ఐదుగురు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో నిందితుడి వాలంటీర్ రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. కల్లులో గడ్డిమందు కలపడం వల్లే ఐదుగురు చనిపోయారని..అక్రమ సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. మహిళ భర్తను చంపేందుకు.. నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు.

అసలేం జరిగింది..

రాజవొమ్మంగి మండలంలోని మారుమూల గిరిజన గ్రామం లోదొడ్డికి చెందిన పి.గంగరాజు (35), సీహెచ్‌.సుగ్రీవ్‌ (70), వి.లోవరాజు(28), బి.సన్యాసిరావు(65), కె.ఏసుబాబు(23) తరచూ జీలుగు కల్లు తాగుతారు. బుధవారం కూడా సొంత జీలుగు చెట్టు ఎక్కి కల్లు సేకరించి తాగారు. ఆ తర్వాత కాసేపటికే వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురికావడంతో వారిని సర్పంచి లోతా రామారావు, స్థానికులు ద్విచక్ర వాహనాలపై జడ్డంగి పీహెచ్‌సీకి తరలించారు. ఇన్‌ఛార్జి వైద్యాధికారి శ్రీదుర్గ ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కాకినాడకు తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా సుగ్రీవ్‌, లోవరాజు చనిపోయారు. గంగరాజు, సన్యాసిరావును కాకినాడ జీజీహెచ్‌లో వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఏసుబాబు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో వ్యక్తి కూడా కల్లు నోట్లో వేసుకున్నప్పుడు వాసన రావడంతో ఉమ్మేయడంతో అతను ప్రాణాలతో బతికాడు. గంగరాజు, సన్యాసిరావు పక్క పక్క ఇళ్లవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియలేదు. పోలీసులు, అబ్కారీ, రెవెన్యూ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని నమూనాలు సేకరించారు.

Deputy CM Narayana Swami: జీలుగుకల్లు తాగి ఐదుగురు మృతిచెందిన ఘటనపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్పందించారు. ఆ కల్లులో రసాయనాలు కలిసినట్లు నివేదిక ద్వారా తెలుస్తోందన్నారు. వ్యక్తిగత వైరంతో కల్లులో విషం కలిపినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. విచారణ జరుగుతోందని.. త్వరలోనే అన్ని వివరాలు తెలుస్తాయని ఉపముఖ్యమంత్రి వివరించారు.

సంబంధిత కథనం:

14:49 February 08

కల్లులో గడ్డిమందు కలిపిన నిందితుడు

Adulterated toddy case: తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం.. లోదొడ్డిలో ఈ నెల 2న జీలుగు కల్లు తాగి ఐదుగురు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో నిందితుడి వాలంటీర్ రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. కల్లులో గడ్డిమందు కలపడం వల్లే ఐదుగురు చనిపోయారని..అక్రమ సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. మహిళ భర్తను చంపేందుకు.. నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు.

అసలేం జరిగింది..

రాజవొమ్మంగి మండలంలోని మారుమూల గిరిజన గ్రామం లోదొడ్డికి చెందిన పి.గంగరాజు (35), సీహెచ్‌.సుగ్రీవ్‌ (70), వి.లోవరాజు(28), బి.సన్యాసిరావు(65), కె.ఏసుబాబు(23) తరచూ జీలుగు కల్లు తాగుతారు. బుధవారం కూడా సొంత జీలుగు చెట్టు ఎక్కి కల్లు సేకరించి తాగారు. ఆ తర్వాత కాసేపటికే వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురికావడంతో వారిని సర్పంచి లోతా రామారావు, స్థానికులు ద్విచక్ర వాహనాలపై జడ్డంగి పీహెచ్‌సీకి తరలించారు. ఇన్‌ఛార్జి వైద్యాధికారి శ్రీదుర్గ ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కాకినాడకు తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా సుగ్రీవ్‌, లోవరాజు చనిపోయారు. గంగరాజు, సన్యాసిరావును కాకినాడ జీజీహెచ్‌లో వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఏసుబాబు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో వ్యక్తి కూడా కల్లు నోట్లో వేసుకున్నప్పుడు వాసన రావడంతో ఉమ్మేయడంతో అతను ప్రాణాలతో బతికాడు. గంగరాజు, సన్యాసిరావు పక్క పక్క ఇళ్లవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియలేదు. పోలీసులు, అబ్కారీ, రెవెన్యూ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని నమూనాలు సేకరించారు.

Deputy CM Narayana Swami: జీలుగుకల్లు తాగి ఐదుగురు మృతిచెందిన ఘటనపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్పందించారు. ఆ కల్లులో రసాయనాలు కలిసినట్లు నివేదిక ద్వారా తెలుస్తోందన్నారు. వ్యక్తిగత వైరంతో కల్లులో విషం కలిపినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. విచారణ జరుగుతోందని.. త్వరలోనే అన్ని వివరాలు తెలుస్తాయని ఉపముఖ్యమంత్రి వివరించారు.

సంబంధిత కథనం:

Last Updated : Feb 8, 2022, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.