ETV Bharat / state

యానాంలో కరోనా ఉద్ధృతి.. వ్యాపార సమయాల్లో కుదింపు

author img

By

Published : Apr 26, 2021, 6:51 PM IST

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానంలో కరోనా కేసులు పెరుగుతున్నందున.. అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. వ్యాపార సమయాలు కుదించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరవాలని ఆదేశించారు.

corona cases in yanam
corona cases in yanam

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానంలో కరోనా కేసులు విజృంభిస్తున్నందున అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే.. నిత్యావసర దుకాణాలు తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన దుకాణాలు మధ్యాహ్నం రెండు గంటలకు మూసివేయాలని యానం డిప్యూటీ కలెక్టర్ అమన్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.

హోటళ్లను రాత్రి పదింటి వరకు అనుమతించి పార్సిల్ ద్వారా మాత్రమే వినియోగదారులకు అందించాలని సూచించారు. ఈ నిబంధనలు ఈనెల 30వ తేదీ వరకు అమలులో ఉంటాయని అన్నారు. అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ హెచ్చరించారు. కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరు స్వీయ రక్షణలో ఉండాలని సూచించారు.

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానంలో కరోనా కేసులు విజృంభిస్తున్నందున అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే.. నిత్యావసర దుకాణాలు తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన దుకాణాలు మధ్యాహ్నం రెండు గంటలకు మూసివేయాలని యానం డిప్యూటీ కలెక్టర్ అమన్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.

హోటళ్లను రాత్రి పదింటి వరకు అనుమతించి పార్సిల్ ద్వారా మాత్రమే వినియోగదారులకు అందించాలని సూచించారు. ఈ నిబంధనలు ఈనెల 30వ తేదీ వరకు అమలులో ఉంటాయని అన్నారు. అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ హెచ్చరించారు. కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరు స్వీయ రక్షణలో ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి: 2023 మార్చి నాటికి అన్​ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.