ETV Bharat / state

'పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ప్యాకేజీ అందజేస్తాం'

తూర్పుగోదావరి జిల్లాలోని ఇందుకూరు పేట పునరావాస కాలనీలను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ సందర్శించారు. పోలవరం ముంపు బాధితులకు పునరావాసం కల్పిస్తామని తెలిపారు.

author img

By

Published : Jun 9, 2021, 3:51 PM IST

polavaram project
పోలవరం ముంపు గ్రామాల సందర్శన


పోలవరం ముంపు బాధితుల అందరికీ పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపట్టామని.. ఇప్పటికే 75 శాతం మందికి పునరావాసం కల్పించామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి.. పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక కమిషనర్ ఆనంద్, ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య, ఆర్డీవో సేన నాయక్​తో కలిసి దేవీపట్నం మండలం ఇందుకూరు పేట-2 పునరావాస కాలనీని సందర్శించి..నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం దేవిపట్నం గ్రామాన్ని సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం పెరుగుతుందని...వర్షాకాలంలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ అన్నారు.


పోలవరం ముంపు బాధితుల అందరికీ పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపట్టామని.. ఇప్పటికే 75 శాతం మందికి పునరావాసం కల్పించామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి.. పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక కమిషనర్ ఆనంద్, ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య, ఆర్డీవో సేన నాయక్​తో కలిసి దేవీపట్నం మండలం ఇందుకూరు పేట-2 పునరావాస కాలనీని సందర్శించి..నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం దేవిపట్నం గ్రామాన్ని సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం పెరుగుతుందని...వర్షాకాలంలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ అన్నారు.

ఇదీ చదవండి:

భార్య వల్లనే చనిపోతున్నా అంటూ.. ఉత్తరం రాసి ఉరేసుకున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.