బోటు ప్రమాదంలో విశాఖ వాసులు ఉండటంపై.. ఆ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దుర్ఘటనలో బాధితుల కోసం కలెక్టర్ వినయ్ చంద్ సహాయక కేంద్రం ఏర్పాటు చేసి, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ టోల్ఫ్రీ నెంబర్ - 1800 425 00002 కి సంప్రదించాలని తెలిపారు. నేవీతో మాట్లాడి డోర్నయిర్ విమానంలో సిబ్బందితో పాటు ఏడుగురు గజ ఈతగాళ్ళను ఘటనా స్థలానికి పంపించరన్నారు. సాధ్యమైనంత త్వరలో హెలికాప్టర్లో ప్రమాద స్థలానికి చేరుకుంటామన్నారు.
ఇదీ చూడండి: