రేషన్ సరుకులు తమకు సక్రమంగా అందించడం లేదని తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఏ.కొత్తపల్లిలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని 150 కుటుంబాలకు గత నెల రేషన్ అందించలేదని వారు వాపోయారు. దీనిపై ఎటువంటి సమాధానం చెప్పకుండా ఈ నెల సరుకులు ఇస్తున్నారని ఆరోపించారు. గత నెల రేషన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత నెలలో సర్వర్ సమస్య వల్ల కొన్ని కుటుంబాలకు రేషన్ ఇవ్వలేకపోయామని మండల సరఫరా అధికారి రామారావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి