యానాంలో 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించే 21వ ఫల పుష్ప ప్రదర్శన కొరకు వ్యవసాయ శాఖ 20 వేల పూల మొక్కలను సిద్ధం చేసింది. స్థానిక వ్యవసాయ క్షేత్రంలో 200 జాతులకు చెందిన విత్తనాలను నాటి మూడు నెలలపాటు సంరక్షించడంతో అవి నేడు పూల హరివిల్లై విరబూసాయి. దేశీవాళి రకాలైన బంతి, చామంతిలు బెంగళూరు జాతులకు చెందిన ఏషియా రకాలు, కోడి జిత్తు పుష్పాలతో పాటు ఆర్నిమెంటల్ మిరప ఇక్కడ కొలువుదీరింది. వీటితోపాటు పుణె .. ముంబై నుండి కూడా వివిధ జాతుల పుష్పాలు తీసుకొచ్చి ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ఇదీచూడండి.'ఉగాదినాటికి పేదలందరికి ఇళ్ల స్థలాలు'