ETV Bharat / state

పరువు తీసేశారు... ప్రాణం వదులుతున్నా.!!

భర్త చనిపోయినా కాలం వెళ్లదీస్తూ బతుకీడుస్తోంది ఆ మహిళ. తన అత్త, ఆడపడుచు ఇల్లు రాసివ్వమని ఒత్తిడికి గురిచేస్తున్నారని పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మెరపల శ్రీదేవి. తన చావుకు గల కారణాలను తెలుపుతూ సెల్పీ ద్వారా తెలిపింది. ప్రస్తుతం శ్రీదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

author img

By

Published : Jun 4, 2020, 11:04 AM IST

Updated : Jun 4, 2020, 11:46 AM IST

annavaram village field assistant suicide attempt
పరువు పోయిందని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఫీల్డ్​ అసిస్టెంట్
ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ శ్రీదేవి తీసుకున్న సెల్ఫీ వీడియో
శ్రీదేవితో తన అత్తతో గొడవ పడుతున్న వీడియో

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో... ఉపాధిహామి క్షేత్ర సహాయకురాలిగా పని చేస్తున్న మెరపల శ్రీదేవి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తన అత్త, ఆడపడుచుతో సహా మరో ముగ్గురు వ్యక్తులు తన చావుకు కారణమంటూ సెల్ఫీ తీసుకుని పురుగుల మందు తాగింది. గమనించిన స్థానికులు శ్రీదేవిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తన అత్త చినబుల్లి, ఆడపడుచు ఇల్లు రాసివ్వమని తనతో పదేపదే గొడవ పడుతున్నారని తెలిపింది. శ్రీదేవిని తన కుటుంబ సభ్యులు, వీధిలో ఉండే నర్సయ్య, శ్రీను, అరుణశ్రీ ఇబ్బందులకు గురి చేస్తూ... తిరిగి తనపై కేసు పెట్టి పరువు తీశారని అందుకే చనిపోతున్నానని తెలిపింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

'అన్ని జిల్లాల్లో సామాజిక మాధ్యమ పరిశీలన విభాగాల ఏర్పాటు'

ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ శ్రీదేవి తీసుకున్న సెల్ఫీ వీడియో
శ్రీదేవితో తన అత్తతో గొడవ పడుతున్న వీడియో

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో... ఉపాధిహామి క్షేత్ర సహాయకురాలిగా పని చేస్తున్న మెరపల శ్రీదేవి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తన అత్త, ఆడపడుచుతో సహా మరో ముగ్గురు వ్యక్తులు తన చావుకు కారణమంటూ సెల్ఫీ తీసుకుని పురుగుల మందు తాగింది. గమనించిన స్థానికులు శ్రీదేవిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తన అత్త చినబుల్లి, ఆడపడుచు ఇల్లు రాసివ్వమని తనతో పదేపదే గొడవ పడుతున్నారని తెలిపింది. శ్రీదేవిని తన కుటుంబ సభ్యులు, వీధిలో ఉండే నర్సయ్య, శ్రీను, అరుణశ్రీ ఇబ్బందులకు గురి చేస్తూ... తిరిగి తనపై కేసు పెట్టి పరువు తీశారని అందుకే చనిపోతున్నానని తెలిపింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

'అన్ని జిల్లాల్లో సామాజిక మాధ్యమ పరిశీలన విభాగాల ఏర్పాటు'

Last Updated : Jun 4, 2020, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.