తూర్పుగోదావరి జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన కర్రి సుబ్బారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వం అందించిన అమ్మఒడి నగదులో కొంత మొత్తాన్ని పాఠశాల అభివృద్ధికి విరాళంగా అందించారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఆ నగదును పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు ఉపయోగిస్తామని ప్రధాన ఉపాధ్యాయురాలు మాణిక్యాంబ తెలిపారు.
ఇదీ చదవండి: