ETV Bharat / state

kanna babu: 'పందులను తరలించకుంటే.. కాల్చివేతకు ఆదేశిస్తాం'

author img

By

Published : Sep 13, 2021, 8:22 AM IST

గ్రామాల్లో పందులు విచ్చలవిడిగా తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వాటి నియంత్రణపై పందుల పెంపకందారులతో సమావేశం నిర్వహించారు.

kanna babu
మంత్రి కురసాల కన్నబాబు

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు అధ్వానంగా ఉండడం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణంలోని రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని పలుప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘గ్రామాల్లో పందులు విచ్చలవిడిగా తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పెంపకందార్లతో సమావేశం నిర్వహించి శివారు ప్రాంతాలకు తరలించాలి. మాట వినకుండా అదే పరిస్థితి కొనసాగిస్తే పందులు కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలిస్తాం’ అని హెచ్చరించారు. వాటి పెంపకందార్లు ముందుకొస్తే ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు అధ్వానంగా ఉండడం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణంలోని రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని పలుప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘గ్రామాల్లో పందులు విచ్చలవిడిగా తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పెంపకందార్లతో సమావేశం నిర్వహించి శివారు ప్రాంతాలకు తరలించాలి. మాట వినకుండా అదే పరిస్థితి కొనసాగిస్తే పందులు కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలిస్తాం’ అని హెచ్చరించారు. వాటి పెంపకందార్లు ముందుకొస్తే ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

ఇదీ చదవండీ.. wind energy: సముద్ర గాలుల నుంచి విద్యుత్‌.. కేఎల్‌యూ ఆచార్యుడి వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.