ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన యాత్రికుల బస్సు.. మహిళ మృతి

యాత్రికుల బస్సు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా పెదపళ్లలో జరిగింది.

author img

By

Published : Mar 15, 2021, 8:09 PM IST

road accident at pedapalli
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన యాత్రికుల బస్సు.

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెదపళ్లలోని కాకినాడ-జొన్నాడ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే చెందింది. ఆలమూరు మండలం పినపల్ల గ్రామానికి చెందిన జ్యోతి.. రావులపాలెంలో నివాసముంటుంది. జ్యోతి.. ద్విచక్రవాహనంపై మండపేట వైపు వెళ్తుంది. ఈ క్రమంలో మురళీకృష్ణ రైస్ మిల్ సమీపంలో ఎదురుగా వస్తున్న యాత్రికుల బస్సు.. ఆమె వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది.

ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మండపేట రూరల్ ఎస్సై దొరరాజు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెదపళ్లలోని కాకినాడ-జొన్నాడ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే చెందింది. ఆలమూరు మండలం పినపల్ల గ్రామానికి చెందిన జ్యోతి.. రావులపాలెంలో నివాసముంటుంది. జ్యోతి.. ద్విచక్రవాహనంపై మండపేట వైపు వెళ్తుంది. ఈ క్రమంలో మురళీకృష్ణ రైస్ మిల్ సమీపంలో ఎదురుగా వస్తున్న యాత్రికుల బస్సు.. ఆమె వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది.

ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మండపేట రూరల్ ఎస్సై దొరరాజు తెలిపారు.

ఇదీ చూడండి: లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు...ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.