తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రీజియన్ పరిధిలో రైతులకు రూ 100 కోట్లు వ్యవసాయ రుణాల పంపిణీ చేశామని ఎస్బీఐ అమలాపురం రీజనల్ మేనేజర్ వేమూరి నరసింహమూర్తి వెల్లడించారు. పి.గన్నవరం ఎస్బీఐ బ్రాంచ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్బీఐ లైఫ్ రుణ రక్ష పాలసీపై ఆయన అవగాహన కల్పించారు. రుణ రక్ష పాలసీ కింద లబ్ధి పొందిన వారికి వివిధ మొత్తాలను డీడీల రూపంలో అందించారు. రీజియన్ పరిధిలో వ్యక్తిగత రుణాలు రూ. 47 కోట్లు, గృహ రుణాలు రూ 126 కోట్లు అందించామని రీజనల్ మేనేజర్ నరసింహ మూర్తి తెలిపారు. బ్రాంచ్ మేనేజర్ మృత్యుంజయరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఇదీ చూడండి చేపల చెరువులు.. కాలుష్యానికి ఆవాసాలు