ETV Bharat / state

తితిదే ఉద్యోగులకు అందిస్తున్న వైద్యంపై ఈవో స‌మీక్ష - టీటీడీ ఈవో సమీక్ష

తితిదే ఉద్యోగులకు అందుతున్న కరోనా వైద్యంపై ఈవో సమీక్ష నిర్వహించారు. కరోనా బారిన పడిన తిరుమల ప్రధాన అర్చకులు ఖాద్రిపతికి మధుమేహం, రక్తపోటు ఉన్నట్లు స్విమ్స్ డైరెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.

ttd eo review
ఈవో స‌మీక్ష
author img

By

Published : Jul 17, 2020, 11:55 PM IST

తితిదే ఉద్యోగులకు స్విమ్స్​లో అందుతున్న కరోనా వైద్యంపై ఈవో అనిల్​కుమార్ సింఘాల్ సమీక్ష నిర్వహించారు. తితిదే పరిపాలనా భవనంలో నిర్వహించిన ఈ సమీక్షలో అదనపు ఈవో, ఏవీ ధర్మారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగుల ఆరోగ్య పరస్థితిపై ఆరా తీశారు. కరోనా బారిన పడిన తిరుమల శ్రీ‌వారి ఆల‌య అర్చ‌కులు ఖాద్రిప‌తి న‌ర‌సింహాచార్యులు మధుమేహం, అధిక రక్తపోటుతో బాధ‌ప‌డుతున్న అంశాన్ని డాక్టర్ వెంగమ్మ వివరించారు. ప్ర‌స్తుతం ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందని తెలిపారు. మ‌రింత మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నైలోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు.

తితిదే ఉద్యోగులకు స్విమ్స్​లో అందుతున్న కరోనా వైద్యంపై ఈవో అనిల్​కుమార్ సింఘాల్ సమీక్ష నిర్వహించారు. తితిదే పరిపాలనా భవనంలో నిర్వహించిన ఈ సమీక్షలో అదనపు ఈవో, ఏవీ ధర్మారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగుల ఆరోగ్య పరస్థితిపై ఆరా తీశారు. కరోనా బారిన పడిన తిరుమల శ్రీ‌వారి ఆల‌య అర్చ‌కులు ఖాద్రిప‌తి న‌ర‌సింహాచార్యులు మధుమేహం, అధిక రక్తపోటుతో బాధ‌ప‌డుతున్న అంశాన్ని డాక్టర్ వెంగమ్మ వివరించారు. ప్ర‌స్తుతం ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందని తెలిపారు. మ‌రింత మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నైలోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు.

ఇదీ చదవండి: తిరుమల దర్శనాలపై సీఎస్‌ నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.