3 వేల 116 కోట్లతో తితిదే బడ్జెట్ తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. సమావేశ తీర్మానాలను తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వెల్లడించారు. 3 వేల 116 కోట్లతో తితిదే బడ్జెట్, కల్యాణి జలాశయం నుంచి రెండో పైప్లైన్ ఏర్పాటుకు ఆమోదించామన్నారు. స్థానికులు 14 అంశాలపై వినతిపత్రాలు ఇవ్వగా, 8 సమస్యల పరిష్కారానికి తితిదే అమోదించిందని పుట్టా సుధాకర్ తెలిపారు.
హుండీ ద్వారా 1,231 కోట్లు, వడ్డీల ద్వారా 845 కోట్లు ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు.దర్శనం టికెట్ల విక్రయం ద్వారా 235 కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా 270 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.