ETV Bharat / state

'చట్టాలు ఉల్లంఘిస్తే చంద్రగిరిని మరచిపోండి'

author img

By

Published : Jun 10, 2020, 11:59 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో తిరుపతి అర్బన్ ఎస్పీ పర్యటించారు. లాక్ డౌన్ సడలించారని చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆవుల రమేష్​రెడ్డి హెచ్చరించారు.

chittor district
'చట్టాలు ఉల్లంఘిస్తే చంద్రగిరిని మరచిపోండి...'

చంద్రగిరిలోని రెడ్ జోన్ ప్రాంతాన్నిమంగళవారం రాత్రి తిరుపతి అర్బన్ ఎస్పీ పరిశీలించారు. నూర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అతిక్రమణలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని జరిమానాలు విధించారు. లాక్ డౌన్ సడలించారని అనవసరంగా పబ్లిక్​లో తిరిగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలకు నెంబర్​ ప్లేట్, సైలెన్సర్ లేకపోయినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా జరిమానాలు తప్పవన్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే శిక్షలు తప్పవని హెచ్చరించారు. చంద్రగిరిలో గంజాయి, సారాయి వాడకం ఎక్కవైందని వారిని గుర్తించి పీడీ యాక్ట్​లు కేసులు నమోదు చేస్తామన్నారు.

చంద్రగిరిలోని రెడ్ జోన్ ప్రాంతాన్నిమంగళవారం రాత్రి తిరుపతి అర్బన్ ఎస్పీ పరిశీలించారు. నూర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అతిక్రమణలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని జరిమానాలు విధించారు. లాక్ డౌన్ సడలించారని అనవసరంగా పబ్లిక్​లో తిరిగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలకు నెంబర్​ ప్లేట్, సైలెన్సర్ లేకపోయినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా జరిమానాలు తప్పవన్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే శిక్షలు తప్పవని హెచ్చరించారు. చంద్రగిరిలో గంజాయి, సారాయి వాడకం ఎక్కవైందని వారిని గుర్తించి పీడీ యాక్ట్​లు కేసులు నమోదు చేస్తామన్నారు.

ఇది చదవండి శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.