ETV Bharat / state

పోలింగ్​ కోసం పటిష్ట చర్యలు చేపట్టాం: తిరుపతి ఎస్పీ

author img

By

Published : Feb 9, 2021, 3:07 PM IST

ఓటర్ స్లిప్పులపై గుర్తులు రాసి ఇస్తున్నారన్న సమాచారం మేరకు ఇప్పటికే కొంతమందిపై చర్యలు తీసుకున్నామని తిరుపతి అర్బన్​ ఎస్పీ వెంకట అప్పయ్య నాయుడు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేలా పటిష్ట భద్రత చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

tirupati sp venkata appaiahnaidu says police department have taken strong security measures for polling
పోలింగ్​ కోసం పటిష్ట చర్యలు చేపట్టాం: తిరుపతి ఎస్పీ

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని కమ్మకండ్రిగ పంచాయతీలో ఓటరు స్లిప్పులపై గుర్తులు రాసిచ్చిన ఘటనలో పలువురిపై కేసులు నమోదు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పయ్య నాయుడు తెలిపారు. ఈ మేరకు గ్రామపంచాయతి పరిధిలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.

జిల్లాలో ఓటర్ స్లిప్పులపై గుర్తులు రాసి ఇస్తున్నారని రామచంద్రాపురం, వడమాలపేట మండలాల పోలీస్​స్టేషన్​ల నుంచి పలు ఫిర్యాదులు అందాయని అర్బన్​ ఎస్పీ వెంకట అప్పయ్య నాయుడు తెలిపారు. కొన్ని ఘటనలను సుమోటోగా స్వీకరించి కేసులు నమోదు చేశామన్న ఆయన పోలింగ్ ప్రశాంతంగా సాగేలా పటిష్ట చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని కమ్మకండ్రిగ పంచాయతీలో ఓటరు స్లిప్పులపై గుర్తులు రాసిచ్చిన ఘటనలో పలువురిపై కేసులు నమోదు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పయ్య నాయుడు తెలిపారు. ఈ మేరకు గ్రామపంచాయతి పరిధిలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.

జిల్లాలో ఓటర్ స్లిప్పులపై గుర్తులు రాసి ఇస్తున్నారని రామచంద్రాపురం, వడమాలపేట మండలాల పోలీస్​స్టేషన్​ల నుంచి పలు ఫిర్యాదులు అందాయని అర్బన్​ ఎస్పీ వెంకట అప్పయ్య నాయుడు తెలిపారు. కొన్ని ఘటనలను సుమోటోగా స్వీకరించి కేసులు నమోదు చేశామన్న ఆయన పోలింగ్ ప్రశాంతంగా సాగేలా పటిష్ట చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాజ్యసభ ఛైర్మన్‌పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు: భానుప్రకాశ్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.