చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని కమ్మకండ్రిగ పంచాయతీలో ఓటరు స్లిప్పులపై గుర్తులు రాసిచ్చిన ఘటనలో పలువురిపై కేసులు నమోదు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పయ్య నాయుడు తెలిపారు. ఈ మేరకు గ్రామపంచాయతి పరిధిలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
జిల్లాలో ఓటర్ స్లిప్పులపై గుర్తులు రాసి ఇస్తున్నారని రామచంద్రాపురం, వడమాలపేట మండలాల పోలీస్స్టేషన్ల నుంచి పలు ఫిర్యాదులు అందాయని అర్బన్ ఎస్పీ వెంకట అప్పయ్య నాయుడు తెలిపారు. కొన్ని ఘటనలను సుమోటోగా స్వీకరించి కేసులు నమోదు చేశామన్న ఆయన పోలింగ్ ప్రశాంతంగా సాగేలా పటిష్ట చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాజ్యసభ ఛైర్మన్పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు: భానుప్రకాశ్రెడ్డి