ETV Bharat / state

'తెదేపా హయాంలో కేటాయించిన ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వాలి'

author img

By

Published : Jul 7, 2020, 11:11 PM IST

ఇళ్ల స్థలాల సేకరణ కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలను తప్పుపడుతూ తెదేపా నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొని తెదేపా హయాంలో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన గృహ సముదాయాలను పేదలకు కేటాయించాలని డిమాండ్​ చేశారు.

tdp leaders protest under ex mla sugunamma
తెదేపా నేతల ఆందోళన

తెదేపా హయాంలో తిరుపతి సమీపంలో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన గృహ సముదాయాలను పేదలకు కేటాయించాలని మాజీఎమ్మెల్యే సుగుణమ్మ డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల సేకరణ కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలను తప్పుపడుతూ తెదేపా నేతలు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తిరుపతి వాసులకు పరిసర ప్రాంతాల్లో కాకుండా.. వేరే గ్రామాల్లో కొండలు, గుట్టల్లో స్థలాలు కేటాయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో నిర్మించిన జీ ప్లస్ త్రీ భవంతులను లబ్దిదారులకు తక్షణమే కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెదేపా హయాంలో తిరుపతి సమీపంలో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన గృహ సముదాయాలను పేదలకు కేటాయించాలని మాజీఎమ్మెల్యే సుగుణమ్మ డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల సేకరణ కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలను తప్పుపడుతూ తెదేపా నేతలు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తిరుపతి వాసులకు పరిసర ప్రాంతాల్లో కాకుండా.. వేరే గ్రామాల్లో కొండలు, గుట్టల్లో స్థలాలు కేటాయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో నిర్మించిన జీ ప్లస్ త్రీ భవంతులను లబ్దిదారులకు తక్షణమే కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి...

తిరుమల ఆలయంలో ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ సిస్ట‌మ్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.