ETV Bharat / state

వృద్ధులు, పిల్లలు తిరుమల రావొద్దు: వై.వి.సుబ్బారెడ్డి

author img

By

Published : Jun 5, 2020, 1:22 PM IST

Updated : Jun 5, 2020, 3:13 PM IST

ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మకంగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శనాన్ని ప్రారంభిస్తామని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. 8, 9తేదీన తితిదే ఉద్యోగులు దర్శనం చేసుకుంటారని..తిరుమలలో పనిచేసే ఉద్యోగులతో దర్శనాల ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని..65 ఏళ్లకు పైబడినవారు, పిల్లలకు దర్శనాలు ఉండవని ఆయన పేర్కొన్నారు.ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమవుతుందుని ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

Srivari Darshan  to devotees from  eleventh  of this month
తిరుమల దర్శనం

తిరుమల దర్శన వివరాలు తెలుపుతున్న తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి

8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం...

ఈ నెల 8వ తేదీ నుంచి తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా శ్రీవారి ద‌ర్శనాన్ని ప్రారంభిస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. సుమారు 3 వేలమందికి ఆన్‌లైన్‌ ద్వారా దర్శనం కల్పిస్తామని... కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావద్దొని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నా కూడా అలిపిరిలో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 65 ఏళ్లకు పైబడినవారు, పిల్లలకు దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ నెల 11 నుంచి ఉదయం 6.30 నుంచి ఉదయం 7.30 గంటల వరకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనాలుంటాయని అన్నారు. ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొన్నాళ్లపాటు అనుమతి ఉండదని..ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు అలిపిరి నడకదారిలో మాత్రమే భక్తులకు కాలినడకన అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఆన్‌లైన్ ద్వారా 3 వేల దర్శన టికెట్లు అందుబాటులో ఉంచుతామని...నేరుగా వచ్చి 3 వేలమంది శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలియజేశారు. శ్రీవారి పుష్కరిణిలో భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శ్రీవారి హుండీలో కానుకలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్‌లు తప్పనిసరి, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

తిరుమల దర్శన వివరాలు తెలుపుతున్న ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌

గంటకు 500 మందికి మాత్రమే దర్శనం..

ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమవుతుందుని ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.జూన్ నెల కోటా మొత్తం విడుదల చేస్తామని..అన్నారు. వసతి గదుల్లో ఒక్కరోజే మాత్రమే భక్తులకు అనుమతినిస్తామని..ఒక్కో గదిలో ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. క్యూలైన్లలో ప్రతి 2 గంటలకు ఒకసారి శానిటైజేషన్‌ ఉంటుందని...500 మంది సిబ్బందికి పీపీఈ కిట్లు ఇచ్చే అవకాశముందని తెలిపారు.

గంటకు 500 మందికి శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తామని అన్నారు.శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాల దర్శనం ఉండదుని స్పష్టం చేశారు. ప్రతి 2 గంటలకు ఒకసారి లడ్డూ కౌంటర్లు మారుస్తామని అన్నారు. తిరుమలలో ప్రైవేటు హోటళ్లకు అనుమతి లేదని...తితిదే అనుబంధ ఆలయాల్లో కూడా పరిమితంగానే అనుమతులుంటాయని సింఘాల్ తెలియజేశారు.

ఆలయంలో ప్రత్యేకంగా అధునాతన కెమెరాబేస్డ్‌ థర్మల్‌స్కానింగ్‌ పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. అలిపిరి టోల్‌గేట్‌తో పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా భక్తులు క్యూలైన్లలోకి వెళ్లే రెండు మార్గాల్లో థర్మల్‌ స్కానింగ్‌ యంత్రాలు అమర్చనున్నారు.

ఇదీచూడండి. శ్రీవారి ఆలయంలో రెండోరోజు ఘనంగా జ్యేష్ఠాభిషేకం

తిరుమల దర్శన వివరాలు తెలుపుతున్న తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి

8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం...

ఈ నెల 8వ తేదీ నుంచి తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా శ్రీవారి ద‌ర్శనాన్ని ప్రారంభిస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. సుమారు 3 వేలమందికి ఆన్‌లైన్‌ ద్వారా దర్శనం కల్పిస్తామని... కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావద్దొని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నా కూడా అలిపిరిలో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 65 ఏళ్లకు పైబడినవారు, పిల్లలకు దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ నెల 11 నుంచి ఉదయం 6.30 నుంచి ఉదయం 7.30 గంటల వరకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనాలుంటాయని అన్నారు. ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొన్నాళ్లపాటు అనుమతి ఉండదని..ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు అలిపిరి నడకదారిలో మాత్రమే భక్తులకు కాలినడకన అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఆన్‌లైన్ ద్వారా 3 వేల దర్శన టికెట్లు అందుబాటులో ఉంచుతామని...నేరుగా వచ్చి 3 వేలమంది శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలియజేశారు. శ్రీవారి పుష్కరిణిలో భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శ్రీవారి హుండీలో కానుకలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్‌లు తప్పనిసరి, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

తిరుమల దర్శన వివరాలు తెలుపుతున్న ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌

గంటకు 500 మందికి మాత్రమే దర్శనం..

ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమవుతుందుని ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.జూన్ నెల కోటా మొత్తం విడుదల చేస్తామని..అన్నారు. వసతి గదుల్లో ఒక్కరోజే మాత్రమే భక్తులకు అనుమతినిస్తామని..ఒక్కో గదిలో ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. క్యూలైన్లలో ప్రతి 2 గంటలకు ఒకసారి శానిటైజేషన్‌ ఉంటుందని...500 మంది సిబ్బందికి పీపీఈ కిట్లు ఇచ్చే అవకాశముందని తెలిపారు.

గంటకు 500 మందికి శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తామని అన్నారు.శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాల దర్శనం ఉండదుని స్పష్టం చేశారు. ప్రతి 2 గంటలకు ఒకసారి లడ్డూ కౌంటర్లు మారుస్తామని అన్నారు. తిరుమలలో ప్రైవేటు హోటళ్లకు అనుమతి లేదని...తితిదే అనుబంధ ఆలయాల్లో కూడా పరిమితంగానే అనుమతులుంటాయని సింఘాల్ తెలియజేశారు.

ఆలయంలో ప్రత్యేకంగా అధునాతన కెమెరాబేస్డ్‌ థర్మల్‌స్కానింగ్‌ పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. అలిపిరి టోల్‌గేట్‌తో పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా భక్తులు క్యూలైన్లలోకి వెళ్లే రెండు మార్గాల్లో థర్మల్‌ స్కానింగ్‌ యంత్రాలు అమర్చనున్నారు.

ఇదీచూడండి. శ్రీవారి ఆలయంలో రెండోరోజు ఘనంగా జ్యేష్ఠాభిషేకం

Last Updated : Jun 5, 2020, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.