ETV Bharat / state

నేడు కాళేశ్వరంలో శ్రీవారికి మాఘ పూర్ణిమ పుణ్య స్నానం

author img

By

Published : Feb 27, 2021, 8:32 AM IST

తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో నేడు శ్రీవారికి ప్రత్యేక జలాభిషేకాలు జరిపించనున్నారు. తితిదే పండితులు రమణ దీక్షితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

Telangana Kaleswaram Triveni Sangamam
నేడు కాళేశ్వరంలో శ్రీవారికి మాఘ పూర్ణిమ పుణ్య స్నానం

తితిదే తలపెట్టిన మాఘ మాస మహోత్సవంలో భాగంగా.. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో నేడు మాఘ పూర్ణిమ పుణ్య స్నాన కార్యక్రమం జరగనుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు గోదావరి తీరంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక జలాభిషేకాలు, స్వామి వారి చక్రానికి ప్రవాహంలో పుణ్యస్నానాలు జరిపించనున్నారు.

తితిదే పండితులు రమణ దీక్షితుల ఆధ్వర్యంలో 50 మంది పండితులు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం, ఆ తరువాత చక్రస్నానం నిర్వహిస్తారు.

తితిదే తలపెట్టిన మాఘ మాస మహోత్సవంలో భాగంగా.. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో నేడు మాఘ పూర్ణిమ పుణ్య స్నాన కార్యక్రమం జరగనుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు గోదావరి తీరంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక జలాభిషేకాలు, స్వామి వారి చక్రానికి ప్రవాహంలో పుణ్యస్నానాలు జరిపించనున్నారు.

తితిదే పండితులు రమణ దీక్షితుల ఆధ్వర్యంలో 50 మంది పండితులు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం, ఆ తరువాత చక్రస్నానం నిర్వహిస్తారు.

ఇదీ చదవండి:

నేడు తితిదే ధర్మకర్తల మండలి సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.