ETV Bharat / state

రూ.50 లక్షల విలువైన మద్యం స్వాధీనం

author img

By

Published : May 18, 2021, 4:28 PM IST

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం, గాజులపల్లిలో రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

liquor caught at Chittoor district
liquor caught at Chittoor district

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం, గాజులపల్లిలో పోలీసులు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఒక వ్యాను, ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

liqour caught at Chittoor district
భారీ మద్యం స్వాధీనం

మంగళవారం ఉదయం గాజులపల్లి గ్రామంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. బంగారుపాళ్యం నుంచి రెండు మోటార్ సైకిళ్లలో నలుగురు వ్యక్తులు అతివేగంగా రావడంతో అనుమానంతో వారిని ఆపి విచారించారు. అంతలోనే ఒక కారు, మరో వ్యాను అటువైపు రావడం గుర్తించారు. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు పారిపోగా మరో ఆరుగురు పోలీసులకు పట్టుబడ్డారు. వ్యాను, కారును పరిశీలించగా.. కర్నాటక రాష్ట్రానికి చెందిన 503 కేసుల సిల్వర్ కప్ బ్రాందీ క్వార్టర్ మద్యం బాటిళ్లు, ఇతర బ్రాండ్లకు చెందిన 105 కేసుల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న హేమంత్ కుమార్, వెంకటేశ్, సురేశ్, మాధవులు, ఫయాజ్, జ్ఞానశేఖర్ ను అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, ఎస్ఈబీ ఏఎస్పీ రిషంత్ రెడ్డి వెల్డడించారు.

ఇదీ చదవండి: 'వైఎస్సార్‌ మత్స్యకార భరోసా' నిధుల విడుదల

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం, గాజులపల్లిలో పోలీసులు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఒక వ్యాను, ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

liqour caught at Chittoor district
భారీ మద్యం స్వాధీనం

మంగళవారం ఉదయం గాజులపల్లి గ్రామంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. బంగారుపాళ్యం నుంచి రెండు మోటార్ సైకిళ్లలో నలుగురు వ్యక్తులు అతివేగంగా రావడంతో అనుమానంతో వారిని ఆపి విచారించారు. అంతలోనే ఒక కారు, మరో వ్యాను అటువైపు రావడం గుర్తించారు. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు పారిపోగా మరో ఆరుగురు పోలీసులకు పట్టుబడ్డారు. వ్యాను, కారును పరిశీలించగా.. కర్నాటక రాష్ట్రానికి చెందిన 503 కేసుల సిల్వర్ కప్ బ్రాందీ క్వార్టర్ మద్యం బాటిళ్లు, ఇతర బ్రాండ్లకు చెందిన 105 కేసుల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న హేమంత్ కుమార్, వెంకటేశ్, సురేశ్, మాధవులు, ఫయాజ్, జ్ఞానశేఖర్ ను అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, ఎస్ఈబీ ఏఎస్పీ రిషంత్ రెడ్డి వెల్డడించారు.

ఇదీ చదవండి: 'వైఎస్సార్‌ మత్స్యకార భరోసా' నిధుల విడుదల

For All Latest Updates

TAGGED:

Madyam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.